Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి మూవీపై విజయేంద్ర ప్రసాద్ అఫీషియల్ అప్డేట్.. మహేష్ ఇక లాకైపోయినట్లే

గుంటూరు కారం హంగామా దాదాపుగా ముగిసినట్లే. సంక్రాంతికి మహేష్ బాబు బాగానే సందడి చేసినప్పటికీ ఆ డోస్ ఫ్యాన్స్ కి సరిపోలేదు. త్రివిక్రమ్, మహెష్ కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలని సినిమా అందుకోలేకపోయింది.

Rajamouli and Mahesh Babu official update by Vijayendra Prasad dtr
Author
First Published Jan 19, 2024, 10:12 PM IST

గుంటూరు కారం హంగామా దాదాపుగా ముగిసినట్లే. సంక్రాంతికి మహేష్ బాబు బాగానే సందడి చేసినప్పటికీ ఆ డోస్ ఫ్యాన్స్ కి సరిపోలేదు. త్రివిక్రమ్, మహెష్ కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలని సినిమా అందుకోలేకపోయింది. అయితే మహేష్ స్టామినాతో కొంతవరకు వసూళ్లు బాగానే వస్తున్నాయి. 

గుంటూరు కారం హంగామా పక్కన పెడితే ఇప్పుడు యావత్ సినీ లోకం దృష్టి రాజమౌళి సినిమాపై పడింది. జక్కన్న తదుపరి చిత్రం మహేష్ బాబుతోనే. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షురూ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చినట్లు ఉంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

ఈ చిత్ర లాంచింగ్ కి జక్కన్న ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు. కానీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం అదిరిపోయేలా అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే.. రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయినట్లు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు. 

ఒక్కసారి స్క్రిప్ట్ పూర్తయితే రాజమౌళి డ్యూటీ ఎక్కేసినట్లే అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు, వర్క్ షాప్ లతో రాజమౌళి ప్లానింగ్ షూటింగ్ కి సంబంధించిన ప్లానింగ్ రచిస్తుంటాడు. జక్కన్న సినిమా అంటే హీరోలు కనీసం 3 ఏళ్ళు లాకై పోయినట్లే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్ తో తెరకెక్కించే చిత్రం ఒక సిరీస్ లా ఉండబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే మహేష్ బాబు మినిమమ్ 5 ఏళ్ళు రాజమౌళి దగ్గర లాక్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios