Asianet News TeluguAsianet News Telugu

Rashmika mandananna: రష్మిక ఎమోషనల్ పోస్ట్... గుడ్ బై చెప్పడం ఇష్టం లేదంటూ...!

స్టార్ లేడీ రష్మిక మందన్నా చకచకా చిత్రాలు పూర్తి చేస్తున్నారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న అమ్మడు హిందీ చిత్రం గుడ్ బై మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

rahsmika mandanna completes good bye movie shoot shares an emotional post
Author
Hyderabad, First Published Jun 26, 2022, 1:48 PM IST


సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఊపేస్తోంది రష్మిక మందాన. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఆరు చిత్రాలు ఉన్నాయి. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కి జంటగా సీతారామం మూవీ చేస్తుండగా, టీజర్ విడుదల చేశారు. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆమె చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ వారసుడు, పుష్ప 2. వారసుడు షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. 

‘ఇక ఒప్పుకున్న చిత్రాలు చకచకా పూర్తి చేస్తుంది. అమితాబ్, రష్మిక కాంబినేషన్ లో గుడ్ బై మూవీ తెరకెక్కుతుండగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. '' గుడ్ బై' సినిమాకు గుడ్ బై చెప్పడం నాకిష్టం లేదు. రెండేళ్లుగా కోవిడ్‌తో పాటు ఏదీ కూడా మమ్మల్ని పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయాయి. అమితాబ్‌ బచ్చన్‌ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలో ఆయనే అత్యుత్తమ మనిషి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్‌ వికాస్‌ బహల్‌కు కృతజ్ఞతలు. నన్ను ఎందుకు ఈ చిత్రంలో తీసుకున్నారో ఆ దేవుడికే తెలియాలి.

మీరు గర్వపడేలా ఈ చిత్రంలో నటించానని అనుకుంటున్నాను. నా బేబీ ‘గుడ్‌బై’ని చూసేందుకు అందరు రెడీగా ఉండాలి.. దీని కోసం నేను వేచి ఉండలేకపోతున్నాను’అంటూ రష్మిక తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్‌ బాల్‌ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios