చంద్రముఖి2పై లారెన్స్ క్లారిటీ.. అవన్నీ ట్రాష్!
`చంద్రముఖి 2` సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లాక్డౌన్ వల్ల షూటింగ్లు ఆగిపోవడం, రిలీజ్లు లేకపోవడంతో రూమర్స్ పెరిగిపోతున్నాయి. అయితే పొగలేనిదే మంట రాదంటారు. రూమర్స్ ని కొట్టిపారేయలేం. కానీ `చంద్రముఖి 2`లో హీరోయిన్లు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి.
రజనీకాంత్, నయనతార, ప్రభు, నయనతార ప్రధాన పాత్రధారులుగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన `చంద్రముఖి` సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు వస్తోన్న అనేక హర్రర్ చిత్రాలకు పునాది వేసిన చిత్రమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాదాపు పదిహేనేళ్ళ తర్వాత దీనికి సీక్వెల్గా `చంద్రముఖి 2` రూపొందుతుంది. మాతృక దర్శకుడు పి.వాసు దీనికి దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఇక రజనీ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే `చంద్రముఖి 2` సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. లాక్డౌన్ వల్ల షూటింగ్లు ఆగిపోవడం, రిలీజ్లు లేకపోవడంతో రూమర్స్ పెరిగిపోతున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగరాదంటారు. రూమర్స్ ని కొట్టిపారేయలేం. కానీ `చంద్రముఖి 2`లో హీరోయిన్లు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. తొలుత తన పాత్రలో జ్యోతిక నటిస్తుందన్నారు. ఆ తర్వాత జ్యోతిక స్థానంలో సిమ్రాన్ను తీసుకుంటున్నారని, ఇటీవల కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకి ఇందులో హీరోయిన్ ఎవరనేది మరింత కన్ఫ్యూజన్గా మారింది.
అయితే అసలు ఈ సినిమాకి హీరోయిన్ ఎంపికే జరగలేదని, ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదని లారెన్స్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన స్పందిస్తూ, ఆయా వార్తలను ఖండించారు. ``చంద్రముఖి 2` సినిమాలో హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జ్యోతిక మేడమ్, సిమ్రాన్ మేడమ్, కియారా అద్వానీ నటిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నిర్మాణ సంస్థ హీరోయిన్ గురించి క్లారిటీ ఇస్తుంది. అప్పుడు మేము అధికారికంగా ప్రకటిస్తాం` అని లారెన్స్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం లారెన్స్ హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా `లక్ష్మీబాంబ్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది `కాంచన`కి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.