Asianet News TeluguAsianet News Telugu

Radhe Shyam: అనుష్క కు ఈ సినిమాతో లింక్ ఇదే, గమనించారా?

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. 

Radhe Shyam: Pooja Hegde is the replica of the former with Anushka Shetty
Author
Hyderabad, First Published Nov 30, 2021, 7:34 AM IST

ప్రబాస్,అనుష్క కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్. ఈ స్వీట్ కపుల్ టాలీవుడ్ ని ఏలింది. మిర్చి నుంచి బాహుబలి దాకా ఈ కాంబినేషన్ కొనసాగింది. ఆమెకు, ప్రభాస్ కు మధ్య ఏదో ఉందనే వార్తలు జాతీయ స్దాయిలో అనేక సార్లు వచ్చాయి కూడా.  వాళ్లిద్ధరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నా ఇద్దరూ లైట్ తీసుకున్నారు. గాసిప్స్ అనేవి వస్తూనే ఉంటాయి.. పైగా మూడు సినిమాలు కలిసి చేసారు.. ఐదేళ్లు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేసారు కాబట్టి ఇవన్నీ కామన్ అన్నారు వాళ్లు. అయినా కూడా రోజురోజుకీ ఈ వార్తలు పెరుగుతూనే  వచ్చాయి. ఈ మధ్యన అనుష్క వార్తల్లో ఉండటం తగ్గాక...ఆ గాసిప్స్ తగ్గాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ తాజా చిత్రం  రాధేశ్యామ్ లో ఆమెను గుర్తు చేసే ఓ షాట్ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే..గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ నేఫద్యంలో భారీ ఎత్తున ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా “రాధేశ్యామ్” మూవీ హిందీ వెర్షన్ లోని ఆషీకీ ఆగయీ సాంగ్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సముద్ర తీరాన అందమైన లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ పాట విజువల్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోహీరోయిన్ల లుక్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అయితే ఈ పాటలోని ఓ షాట్ మిర్చిలోని అనుష్క, ప్రభాస్ ఉన్న బాగా  పాపులర్ షాట్  ని గుర్తుకు తెస్తోందని అభిమానులు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మిర్చి చిత్రాన్ని కూడా నిర్మించింది ఇదే బ్యానర్ కావటం విశేషం. 

 పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios