Asianet News TeluguAsianet News Telugu

రష్యాలో ‘పుష్ప’ గ్రాండ్ ప్రీమియర్.. సందడి చేయబోతున్న అల్లు అర్జున్, సుకుమార్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప : ది రైజ్’. గతేడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం రష్యాలోనూ రిలీజ్ కాబోతోంది. ఇందుకోసం ‘పుష్ప’ టీం రష్యాకు ప్రయాణం కానుంది. జోరుగా ప్రమోషన్స్ నిర్వహించనుంది.
 

Pushpa Movie grand premiere in Russia, Interesting details!
Author
First Published Nov 28, 2022, 3:00 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప : ది రైజ్’ (Pushpa The Rise). 2021 డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర థియేటర్లలో దుమ్ములేపించింది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. రూ.360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఊహించని విధంగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. 

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని రష్యన్ లాంగ్వేజీల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు అంతా సిద్ధమైంది. వచ్చే నెలలోనే విడుదల చేయనున్నట్టు మేకర్స్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 8న రష్యాలో ‘పుష్ప : ది రైజ్’ విడుదలవుతుందని అనౌన్స్ చేశారు. పుష్ప ప్రీమియర్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 1న మాస్కో మరియు డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పుష్ప రాజ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

చిత్రంలోని పుష్ఫ రాజ్ మేనరిజం, డైలాగ్స్, పాటలు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా పొలిటిషన్స్, స్టార్ క్రికెటర్లు పుష్ప రాజ్ ను ఇమిటేడ్ చేయడంతో ఐకానిక్ ఫిల్మ్ గా గుర్తింపు పొందింది. ఇక రష్యా రిలీజ్ తర్వాత మరింత క్రేజ్ పెరగనుంది. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంతో వహించిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా జపాన్, యూఎస్ ప్రీమియర్స్ తో తెలుగు సినిమా సత్తా చూపించగా.. ప్రస్తుతం ‘పుష్పరాజ్’ రంగంలోకి దిగారు. 

‘పుష్ప’ ఘన విజయం సాధించడంతో దీనికి సీక్వెల్ ను కూడా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. సినిమా షూటింగ్ కూడా అక్టోబర్ లోనే  రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైనట్టు సమాచారం. సీక్వెల్ ను సుకుమార్ మరింత గ్రాండ్ గా తెరకెక్కించునున్నారు. 
ఇప్పటికే అదిరిపోయే యాక్షన్ సీక్వెల్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్ 2ను మేకర్స్ రూ.350 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈసారి మరింత పాత్రలు యాడ్ కానుండటంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios