‘పోకిరి’ మొదట అనుకున్న టైటిల్,హీరో,హీరోయిన్ వేరే!
రూ.70కోట్ల గ్రాస్తో రూ.40కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ముందుగా అనుకున్నహీరో వేరు, హీరోయిన్ వేరు, టైటిల్ కూడా వేరు. ఆ విశేషాలు చూద్దాం.
సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ‘పోకిరి’ సినిమా విడుదలైంది. ‘పోకిరి’ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ.70కోట్ల గ్రాస్తో రూ.40కోట్ల షేర్ సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ముందుగా అనుకున్నహీరో వేరు, హీరోయిన్ వేరు, టైటిల్ కూడా వేరు. ఆ విశేషాలు చూద్దాం.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానానకు కాకుండా ముందుగా నాగార్జున ‘సూపర్’లో నటించిన అయేషా టకియాను అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఆమె ఈ సినిమాలో నటించలేదు. కానీ పోకిరి హిందీ రీమేక్ ‘వాంటెడ్’లో సల్మాన్ సరసన నటించింది.
ఇక దర్శకుడు పూరి జగన్నాథ్ తన తొలి చిత్రం ‘బద్రి’ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్ను రాసుకున్నారట. మొదట ఈ కథకు హీరోగా అనుకున్నది మహేష్ను కాదు.. మాస్రాజా రవితేజని. అలాగే ఈ చిత్రాన్ని ఆయనతోనే ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ’ అనే టైటిల్తో తెరకెక్కిద్దామని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్ దగ్గరకు చేరింది. ఆయన ఈ స్క్రిప్ట్లోకి ఎంట్రీ ఇచ్చాక.. పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ‘పోకిరి’గా మార్చారు.
అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి తొలుత అనుకున్నది అయేషా టకియాని అనుకున్నా... తర్వాత ఆ అవకాశాన్ని కంగనా రనౌత్ దక్కించుకుంది. ఈ చిత్ర ఆడిషన్స్ ముంబయిలో జరుగుతున్న సమయంలో.. అక్కడే బాలీవుడ్ చిత్రం ‘గ్యాంగ్స్టర్’కూ ఆడిషన్స్ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగన.. పనిలో పనిగా ‘పోకిరి’ చిత్రానికీ ఆడిషన్స్ ఇచ్చింది. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కంగనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాకు దక్కింది.