Asianet News TeluguAsianet News Telugu

#SSMB28:ప్రీ రిలీజ్ బిజినెస్ ...అంత సీన్ లేదని తేల్చేసిన నిర్మాత

త్రివిక్రమ్ శ్రీనివాస్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగాడో మూడో సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. రీసెంట్ గా  సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది.

Producer Naga Vamsy about Mahesh, Trivikram movie business
Author
First Published Oct 3, 2022, 2:07 PM IST

మహేష్ నుంచి ఓ భారీ హిట్ ను ఎక్స్పెట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు అదే పనిలో కష్టపడుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తర్వాత మహేష్  త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది.దాంతో మహేష్ అభిమానులంతా ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతడు, ఖలేజా సినిమాలకు బిన్నంగా ఈ మూవీ ఉండనుందని చెప్తున్నారు. 

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జరిగింది . త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ గురించి రకరకాల వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 300 కోట్లు దాకా పలుకుతుందని, డిజిటెల్ బిజినెస్ 200 కోట్లు దాకా ఉంటుందని చెప్తున్నారు. ఇవే విషయాలను నిర్మాత నాగవంశీ ముందు పెట్టినప్పుడు ఆయన ఆయన స్పందించిన తీరు షాక్ ఇచ్చింది.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ....ఏమి బిజినెస్ చెయ్యలేదు అని అన్నారు. ఏవో ఫిగర్స్ చెప్పేస్తున్నారు. అవేమీ లేదు. మేము జనరల్ గా ఓ షెడ్యూల్ ప్రోపర్ గా పూర్తయ్యాక గానీ బిజినెస్ ప్రారంభించము. బిజినెస్ ఏమీ కాలేదు.మేము అంతదూరం ఆలోచించలేదు. అయినా  మూడు వందలు కోట్లు బిజినెస్ ఎందుకు అవుతుంది. ఇప్పుడేమీ చెప్పలేము. థియేటర్ పొజిషన్ తెలియదు కదా.నాన్ థియేటర్ ..డిజిటల్ వంద కోట్లు అనటానికి ఇది తెలుగు సినిమా..ప్యాన్ కాదు కదా అని తేల్చి చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరో ప్రక్క మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు.
 
ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్.  
 

Follow Us:
Download App:
  • android
  • ios