Asianet News TeluguAsianet News Telugu

పవిత్రా నరేష్ వీడియోలు వెనక M.S.రాజు??... షాకింగ్ మ్యాటర్

 ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో సైతం వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో  చర్చలు నడిచాయి. 

Producer M.S Raju behind Pavitra lokesh, naresh videos
Author
First Published Mar 21, 2023, 12:24 PM IST


తెలుగు పరిశ్రమలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల  వ్యవహారం గత కొన్నాళ్లుగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో సైతం వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో  చర్చలు నడిచాయి. అలాగే నాలుగు రోజుల తర్వాత విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆయన భార్య రమ్యతో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగా.. నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వచ్చాయి. అయితే అదీ నిజం కాదు అన్నారు. అసలు ఇదంతా ఏమిటి అంటే..కావాలని ఓ స్ట్రాటజీ ప్రకారం సినిమాకు క్రేజ్ రప్పించటానికి చేస్తున్న ప్రయత్నమే అంటున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరకుపవిత్రతో కలిసి నరేష్ ‘సెకండ్ ఇన్నింగ్స్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య బోల్డ్ సినిమాలు మొదలు పెట్టి దూకుడుగా డైరెక్ట్ చేస్తున్న ఎమ్మెస్ రాజు దీనికి దర్శకుడు ని తెలుస్తోంది.  ఈ సినిమా కథ ప్రకారం...మొదటి పెళ్లి విఫలమైన ఓ జంట కలిసి సహజీవనం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కడమే అంటున్నారు. ఈ సినిమాకు నరేష్ నే నిర్మాత. 

అందుకే దూకుడుగా ఈ వీడియోలు వదులుతున్నారట. నిజ జీవితంలో నరేష్ కథనే స్క్రీన్ పై సినిమాగా ఎమ్మెస్ రాజు తీస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఒక్కో వీడియో రిలీజ్ చేస్తూ డిఫరెంట్ ప్రమోషన్ చేస్తున్నాడు నరేష్. అందుతున్న సమాచారం మేరకు‘సెకండ్ ఇన్నింగ్స్’ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే ప్రమోషన్ మొదలు పెట్టనున్నారు. 

ఈ సినిమాలో పవిత్రా నరేష్ మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయని , ఎమ్మెస్ రాజు ప్రీవీయస్ మూవీస్ లో ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న రొమాంటిక్ మోతాదు కూడా ఎక్కువగానే ఉండనుందని తెలుస్తుంది. 

ఇక నరేష్, పవిత్ర తమ పెళ్లి గురించి ప్రకటించిన రోజునే రమ్యా మీడియాతో మాట్లాడింది. వారి పెళ్లి జరగనివ్వనని తెలిపింది. నరేష్, పవిత్రల లిప్ లాక్‌పై కూడా స్పందించింది. తనకూ, నరేష్ కూ విడాకులు అయిపోయాయని, అందుకే నరేష్, పవిత్రను పెళ్లి చేసుకోవడానికి సిద్దమైపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయని, అందులో ఏ మాత్రం నిజం లేదని ఆమె వెల్లడించింది. తమ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోందని చెప్పంది. పవిత్ర తన ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు తన చేత్తో అన్నం పెట్టానని, ఇప్పుడు అన్న పెట్టిన చేతికే సున్నం రాస్తోందని మండిపడింది. అయితే, ఇదంతా రమ్య రెండు నెలల కిందట చెప్పిన మాటలు. ప్రస్తుతం ఈ కేసు ఎంతవరకు వచ్చిందనేది.. రమ్య స్పందిస్తేనే తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios