సారాంశం

 డిసెంబర్‌ 22 నుంచి డైనోసార్‌ వేట మొదలవుతుదంటూ సోషల్ మీడియోలో హోరెత్తించేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమా గురించిన ఓ వార్త హల్ చల్ చేయటం మొదలైంది.  
 

గత కొద్ది రోజులుగా మీడియా మొత్తం ప్రభాస్‌ లేటెస్ట్ ఫిల్మ్ ‘సలార్‌’గురించిన కబుర్లే. ఈ సినిమా రిలీజ్ పై ఉన్న సందిగ్దత రీసెంట్ గానే తొలిగింది.  డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్‌గా కనిపించడంతో అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిసెంబర్‌ 22 నుంచి డైనోసార్‌ వేట మొదలవుతుదంటూ సోషల్ మీడియోలో హోరెత్తించేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమా గురించిన ఓ వార్త హల్ చల్ చేయటం మొదలైంది.  

సలార్ చిత్రం గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు  రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభమైన టైమ్ లోనూ ఇవే వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని అన్నారు. కానీ ఇప్పుడు ఉగ్రం సినిమాని యూట్యూబ్ నుంచి తొలిగించారని, ఈ సినిమా రీమేక్ కాబట్టే అలా చేసారు అంటున్నారు.   అయితే హిందీ ఉగ్రం తొలిగించారు కానీ కన్నడ ఒరిజనల్ ఉగ్రం అలాగే ఉంది. కాబట్టి ఈ వార్తలు నిరాధారమే అని చెప్పాలి. యూట్యూబ్‌లో ఉన్న ఉగ్రం సినిమాకు 50 మిలియన్లకు పైగానే వ్యూస్‌ వచ్చాయి. నిజంగా తొలిగించాలనుకుంటే ఎక్కడా ఆ సినిమా లేకుండా చేసి ఉందురు. అయితే అదే డైరక్టర్ చేస్తున్న ఫిల్మ్ కాబట్టి కొంత ఇన్ఫూలెన్స్ ఉండి ఉండవచ్చు. అంతమాత్రాన దానికి రీమేక్ అంటే ఎలా .

మరో ప్రక్క సలార్‌ ని దెబ్బ తీయటానికి  విడుదల తేదీ ప్రకటించిన నాటి నుంచి రూమర్స్‌ స్ప్రెడ్ చేస్తున్నారంటున్నారు.కన్నడలో ఉగ్రం సినిమా భారీ హిట్‌ క్టొటినప్పుడు...మళ్లీ ఇదే సినిమాను రీమేక్‌గా ప్రశాంత్‌ నీల్‌ ఎందుకు తీస్తాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  అయితే  కొన్ని నెలల క్రితం సలార్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ  సినిమా గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్లీ ట్రెండింగ్ అవటం మొదలైంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ... ' డైరెక్టర్​ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్​కు.. సలార్​ రీమేక్​ అని అందులో ఆయన ఆయన చెప్పారు. రవి బస్రూర్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. 

 

‘కేజీఎఫ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ను అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటిస్తోంది.  ‘పొగరు’ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.