ప్రభుదేవా షాక్.. సీక్రెట్గా సెకండ్ మ్యారేజ్?
ప్రభుదేవా ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చాడు. రహస్యంగా రెండో పెళ్ళి చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బీహార్కి చెందిన ఓ డాక్టర్ని ఆయన మ్యారేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా పెళ్ళి విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నారు. ఆయన మొదట రామలతని వివాహం చేసుకుని 2011లో విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం సాగించి పెళ్లి వరకు వెళ్ళాడు. చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయ్యింది. ఇటీవల తన బంధువులకు చెందిన ఓ అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు ఏకంగా పెద్ద షాక్ ఇచ్చాడు ప్రభుదేవా. రహస్యంగా రెండో పెళ్ళి చేసుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బీహార్కి చెందిన ఓ డాక్టర్ని ఆయన మ్యారేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ప్రభుదేవా వెన్నముక సమస్యతో బాధపడ్డారు. దీనికి ఆయన ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఆయనకు చికిత్సను అందించిన డాక్టర్తోనే ప్రభుదేవా ప్రేమలో పడ్డాడట. కొంత కాలం చాలా రహస్యంగా డేటింగ్ చేసిన ఈ జోడి.. సెప్టెంబర్లోనే మ్యారేజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ముంబయిలోని ప్రభుదేవా నివాసంలో ఈ మ్యారేజ్ చాలా సీక్రెట్గా జరిగిందని, ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారని సమాచారం. ప్రభుదేవాకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ వార్త లీకైనట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రభుదేవాకి ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య రామలతకి జన్మించారు. ఇక ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా `రాధే` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాని వచ్చే ఏడాది ఈద్కి విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.