ప్రభాస్‌(prabhas) హీరోగా రూపొందుతున్న `రాధేశ్యామ్‌`(radheshyam) సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR movie) సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని దీంతో  ఫెస్లివల్‌ మూవీస్‌ వాయిదా పడుతున్నాయని ఓ వార్త వైరల్‌ అవుతుంది.

ప్రభాస్‌ నుంచి ఇమీడియట్‌గా రాబోతున్న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. దీన్ని వచ్చే సంక్రాంతికి జనవరి 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ ప్రకటించాయి. ప్రస్తుతం థియేటర్‌కి ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ రాలేకపోతున్న నేపథ్యంలో సంక్రాంతిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ వాయిదా పడబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని, దీంతో ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న ప్రభాస్‌ రాధేశ్యామ్‌, మహేష్‌ `సర్కారు వారి పాట`, పవన్‌ `భీమ్లా నాయక్‌` చిత్రాలను పోస్ట్ పోన్‌ చేయించే పనిలో ఉన్నారని, ప్రస్తుతం దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్‌ స్పందించింది. సినిమా అనుకున్న డేట్‌కే వస్తుందని, ఇతర ఎలాంటి ప్రభావాలు సినిమా విడుదలపై లేవని తెలిపింది. జనవరి 14నే రిలీజ్‌ చేయబోతున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. ఈ సినిమా తెలుగు, హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరిగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రభాస్‌, పూజా హెగ్డేల కెమిస్ట్రీ బాగా పండిందని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ని బట్టి అర్థమవుతుంది. 

Scroll to load tweet…