బాలీవుడ్ హీరోకి ప్రభాస్ ఫోన్.. మ్యాటరేంటంటే..?
హీరోలు అవకాశం ఉన్నప్పుడల్లా తమ తోటి హీరోలతో టచ్ లో ఉంటూంటారు. వాళ్లతో పార్టిలకు వెళ్తూంటారు.
హీరోలు అవకాశం ఉన్నప్పుడల్లా తమ తోటి హీరోలతో టచ్ లో ఉంటూంటారు. వాళ్లతో పార్టిలకు వెళ్తూంటారు. ముచ్చట్లు పెడుతూంటారు. తమ ప్రాజెక్టుల గురించి చర్చిస్తూంటారు. అలా అందరితో కలివిడిగా కలిసిపోయే హీరోలతో ప్రభాస్ ఒకరు. తనకు ఖాలీ దొరికినప్పుడల్లా మిగతా హీరోలకు పార్టీలు ఇస్తూ సరదాగా గడిపేస్తూంటాడు. అంతేకాదు వారిలో ప్రతిభను గుర్తించి పొగడ్తల్లో ముంచెత్తి, వారికు బూస్టప్ ఇస్తూంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు ఫోన్ చేసి దాదాపు ఏడు నిముషాల పాటు ప్రభాస్ అదే చేసారు. ఎందుకలా..ఏం మాట్లాడారు అంటే..?
తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో షాహిద్ కపూర్ లుక్స్తో పాటు నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పర్ఫెర్మాన్స్కి ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. అయితే తెలుగువాళ్లు మాత్రం విజయ్ దేవరకొండ ను మక్కీకి మక్కీ దింపేసాడన్నారన్నారు.
అది ప్రక్కన పెడితే.. ప్రభాస్ కూడా బాలీవుడ్ అర్జున్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చి షాహిద్కి విషెస్ తెలిపారు. వీరిద్దరు ఫోన్లో దాదాపు 7 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. మరి ఈ విషయం బయిటకు ఎలా వచ్చింది .
షాహిద్ కపూర్, ప్రభాస్లకి కామన్ హెయిర్ స్టైలిస్ట్గా ఉన్న ఆలిమ్ హకీం వీరిద్దరు కాల్ మాట్లాడేందుకు సహకరించాడు. ఆలిమ్ మాట్లాడుతూ.. సాహో చిత్ర షూటింగ్లో ఉన్న నేను ఆన్లైన్లో కబీర్ సింగ్ టీజర్ని ప్రభాస్కి చూపించాను. షాహిద్ నటన ప్రభాస్కి ఎంతగానో నచ్చింది. నా ఫోన్ ద్వారా ఇద్దరు సూపర్ స్టార్స్ని కలిపాను. ఒరిజినల్ కన్నా బాగా చేశారని ప్రభాస్... షాహిద్కి కాంప్లిమెంట్స్ ఇచ్చాడంటూ ఆలిమ్ హకీం పేర్కొన్నారు.