'సాహో'పై ప్రభాస్ అప్డేట్!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం 'సాహో'.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మేజర్ పార్టీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ చూసిన తరువాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్ట్ 15న సినిమా రిలీజ్ చేస్తుండడంతో ప్రమోషన్స్ కూడా ముమ్మరం చేశారు.
తాజాగా హీరో ప్రభాస్ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఓ స్టిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. 'ఆస్ట్రియాలోని ఇన్స్ బ్రక్, టిరోల్ ప్రాంతంలో షూటింగ్.. గతంలో ఎన్నడూ లేని ఓ అధ్బుతమైన అనుభూతి' అంటూ ట్వీట్ చేశాడు.
ప్రభాస్, శ్రద్దా కపూర్ లపై చిత్రీకరిస్తోన్న ఈ పాటకు వైభవీమర్చంట్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.