Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి తరువాత సాహోలో మార్పులు చేశాం : ప్రభాస్

ఆగస్ట్ 30న వరల్డ్ వైడ్ గా సాహో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం మీడియాతో ముచ్చటించిన ప్రభాస్ - శ్రద్దా కపూర్ సరదగా వారి అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రభాస్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు నవ్వుతూ మాట్లాడారు.

prabhas comments on cricket
Author
Hyderabad, First Published Aug 11, 2019, 6:01 PM IST

సినిమాలో సిక్సర్ డైలాగ్ గురించి మాట్లాడుతూ.. నేను కొడితే సిక్స్ మాత్రమే కొట్టాలని అనుకుంటా. నాకు డిఫెన్స్ ఆడటం ఇష్టం ఉండదు అని ఆన్సర్ ఇచ్చాడు. ఇక హిందీలో డైలాగ్ చెప్పాలని అందరూ కోరగా ప్రభాస్ సింపుల్ గా జై హింద్ అని చెప్పడం అందరిని ఎట్రాక్ట్ చేసింది. 

ఇకపోతే హిందీ తానే డబ్బింగ్ చెప్పానని మాట్లాడుతూ..నాకు హిందీ రాయడం - చదవడం వచ్చినప్పటికీ బాలీవుడ్ లో హిందీ డబ్బింగ్ చెప్పడం కష్టంగా ఉండేది. అయితే మాస్టర్ ని సెట్ చేసుకొని నేర్చుకొని డబ్బింగ్ చెప్పాను. అలాగే శ్రద్దా కూడా చాలా అద్భుతంగా నటించింది. సినిమాలో స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే విజువల్స్ అందరిని ఆకట్టుకుంటాయి. 

బాహుబలి 1 కంటే ముందే ఈ కథ నేను విన్నాను. కానీ బాహుబలి 2 తరువాత సినిమాలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. యాక్షన్ విజువల్స్ పరంగా కొన్ని చేంజ్ చేయాల్సి వచ్చింది.  జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. టీజర్ చూసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ చూసి మేమందరం షాకయ్యాం అని ప్రభాస్ వివరణ ఇచ్చాడు.

ప్రభాస్ తో రొమాన్స్ - యాక్షన్.. ఫుల్ ఎంజాయ్ చేశా: శ్రద్దా కపూర్  

చిరంజీవి గారు మెస్సేజ్ చేయగానే షాకయ్యా : ప్రభాస్ 

Follow Us:
Download App:
  • android
  • ios