Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కు మైత్రీ మూవీస్ స్వీట్ షాక్?

ప్రభాస్ గారు, హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ హీరోగా కూడా ఒక సినిమా ప్లానింగులో ఉంది'' అని నవీన్ యెర్నేని తెలిపారు. 

Prabhas and Siddharth Anand project to roll from mid-2023
Author
First Published Jan 15, 2023, 4:22 PM IST

షారూఖ్ ఖాన్ తో ప‌ఠాన్ చిత్రం చేస్తున్న  డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాన్ ఇండియ‌న్ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ది.  ఆ నిర్మాణ సంస్ద మరెదో కాదు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). గత కొంతకాలంగా ఈ సినిమాపై వర్క్ జరుగుతోంది. లేటెస్టుగా 'అన్‌స్టాపబుల్‌ 2'కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి వచ్చారు. వాళ్ళను ప్రభాస్ సినిమా గురించి బాలకృష్ణ అడగ్గా... కన్ఫర్మ్ చేశారు.

ప్రభాస్ వరస పెట్టి ప్రాజెక్టులు కమిటవ్వుతున్నారు. ఆయన ఒప్పుకున్న , చేస్తున్న  సినిమాల లిస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా గ్రాఫిక్ వర్క్ లో చెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఆదిపురుష్‌ వస్తుంది. ఇక నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న  ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఈ ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలే కాకుండా సలార్ కూడా లైన్లో ఉంది. ఈ సినిమా కూడా ఇదే సంవత్సరం వస్తుంది. ఇదే కాకుండా మారుతి దర్శకత్వంలో మరో సినిమా కూడా రెడీ అవుతోంది. అయితే ఇవన్నీ పూర్తయిన తరువాత స్పిరిట్ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది.

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతోన్న స్పిరిట్ సినిమా కాప్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. పోలీస్‌గా ప్రభాస్ ఇందులో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమా పక్కన పెడితే.. ఇప్పుడు ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ మీద అప్డేట్ వచ్చింది. ప్రభాస్‌తో సినిమా తీయాలని మైత్రీ మూవీస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఇప్పుడు ఖరారు అయ్యింది. ''ప్రభాస్ గారు, హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నాం. సల్మాన్ ఖాన్ హీరోగా కూడా ఒక సినిమా ప్లానింగులో ఉంది'' అని నవీన్ యెర్నేని తెలిపారు. 

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ మ‌రో  హీరో గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారంజ‌రుగుతోంది.  ఇక పఠాన్ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చాక ప్రభాస్ అభిమానులు..వాటిని సాహో సినిమాలో షాట్స్ తో పోల్చి చూపెడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇప్పుడు అదే దర్శకుడుతో ప్రభాస్ సినిమా అనగానే స్వీట్ షాక్ తగినట్లు అయ్యిందని యాంటి ఫ్యాన్స్ అంటున్నారు. తన సినిమాలు చూసి షాట్స్ పెట్టిన దర్శకుడుకే ప్రభాస్ డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఇదంతా మైత్రీ మూవీస్ వారు సెట్ చేయటం వార్తల్లో విషయంగా మారింది. ఏదైమైనా మైత్రీ మూవీస్ ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలతో దూసుకెళ్లింది. ఇప్పుడు మరిన్ని పెద్ద ప్రాజెక్టులు లైన్ లో పెట్టే పనిలో ఉంది.

ప్ర‌స్తుతం షారుఖ్‌ఖాన్‌తో ప‌ఠాన్ సినిమా చేస్తోన్నాడు సిద్ధార్థ్ ఆనంద్‌. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా జ‌న‌వ‌రి 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జాన్ ఆబ్ర‌హ‌మ్ విల‌న్‌గా కనిపించబోతున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios