Asianet News TeluguAsianet News Telugu

పూజా హెగ్డే రెమ్యునరేషన్.. తగ్గే ప్రసక్తే లేదంటోంది!

'డీజే' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తోంది. అలానే ప్రభాస్ తో కలిసి 'జాన్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది.

pooja hegde's remuneration
Author
Hyderabad, First Published Sep 25, 2019, 11:11 AM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు హీరోల చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి ఆ ప్రకారమే రెమ్యునరేషన్స్ ఇస్తుంటారు. అందుకే మన హీరోయిన్లు డిమాండ్ ఉన్నప్పుడే భారీ రేమ్యునరేష్ తీసుకుంటూ ఉంటారు.

నటి పూజా హెగ్డే కూడా అదే బాటలో నడుస్తోంది. 'డీజే' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో  నటిస్తోంది. అలానే ప్రభాస్ తో కలిసి 'జాన్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఈ రెండు మంచి క్రేజ్ ఉన్న సినిమాలే.

దీంతో అమ్మడు తన రేమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు తీసుకుంటుంది. ఈ రెమ్యునరేషన్ పూజకి చాలా ఎక్కువని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు లేకపోవడంతో మేకర్లు పూజాని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

సమంతకి పెళ్లి కావడం, రకుల్ క్రేజ్ తగ్గిపోవడం, రాశి, మెహ్రీన్ లాంటి వారికి స్టార్ హోదా లేకపోవడంతో ఫిలిం మేకర్ల వద్ద మరో ఆప్షన్ లేక పూజానే తీసుకుంటున్నారు. అది పూజాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో తన రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు వెనుకడుగు వేయడం లేదు. 
  

Follow Us:
Download App:
  • android
  • ios