Asianet News TeluguAsianet News Telugu

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ప్లేస్ ఫిక్స్! ఎక్కడంటే?

టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో పోటీపడబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’,‘వీరసింహారెడ్డి’లు  రిలీజ్ కు సిద్ధం అవుతుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్లపై క్రేజీ అప్డేట్ అందింది.

Place final for Veerasimha Reddy, Waltheru Veeraiya pre release events!?
Author
First Published Dec 15, 2022, 6:54 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగానే ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీరసింహారెడ్డి’చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 2023 జనవరి 12న బాలయ్య ఎంట్రీ ఇవ్వగా.. ఒక్క రోజు తేడాతో జనవరి 13న చిరంజీవి థియేటర్లలో అడుగుపెట్టబోతున్నారు. సంక్రాంతికి వీరిద్దరి మధ్య గట్టిపోటీ ఉంటుందనే స్పష్టంగా అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈరెండు చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల ఎక్కడ జరగబోతాయనేది ఆసక్తికరంగా మారింది. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్  ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. చిత్ర యూనిట్ ప్రస్తుతం యూరోప్ లో మిగిలిన సాంగ్స్ ను షూట్ చేసుకొని తిరిగి రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. చిరు వింటేజ్ లుక్ లో కనిపించబోతుండటం, మాస్ మహారాజ ముఖ్య పాత్రలో అలరించబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

‘అఖండ’తో హిట్ అందుకున్నాక.. నందమూరి నటసింహాం, సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna)నటిస్తున్న మాస్  యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). గోపీచంద్ మాలిలేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా చిత్రీకరణను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధం అవుతోంది. రాయసీమ బ్యాక్ డ్రాప్ లో చిత్రం రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ గా అవతరించిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’లో మరింత మాస్ ను చూపించబోతున్నారు. 

ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మిస్తోంది. దీంతో వాటి ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తుండటంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా భారీ స్థాయిలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్ వైజాగ్ లో... బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఈవెంట్ ను రాయలసీమలో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. రెండు ఆంధ్రాలోనే జరుపుకోబోతుండటంతో మరింత హైప్ క్రియేట్ కానుంది. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ గా శృతి హాసన్ (Shruti Haasan) నటించబోతుండటం మరో ఆసక్తికరమై విషయం. శృతి ఎవరి సరసన మెప్పిస్తుందో చూడలి మరీ..

Follow Us:
Download App:
  • android
  • ios