Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ కొత్త సినిమా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`.. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ రచ్చ.. పోస్టర్‌ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలే!

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ల కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. లేటెస్ట్ పోస్టర్‌ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం.
 

pawan kalyan new movie ustaad bhagat singh officially announced perfect treat for fans
Author
First Published Dec 11, 2022, 7:32 AM IST

పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా అప్‌ డేట్‌ వచ్చింది. ఆదివారం పూట అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు పవన్‌. తన కొత్త సినిమాని ప్రకటించారు. హరీష్‌ శంకర్‌తో చేయాల్సిన సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అనే టైటిల్‌ ఖరారు చేశారు. గతంలో హరీష్‌ శంకర్‌తో `భవదీయుడు భగత్‌ సింగ్‌` అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కథలో మార్పులు చేసి టైటిల్‌ కూడా మార్చినట్టు తెలుస్తుంది. తాజాగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అంటూ ఈ కొత్త సినిమాని ఆదివారం ఉదయం ప్రకటించారు. `మనల్ని ఎవడ్రా ఆపేది` అనే ట్యాగ్‌ లైన్‌ దుమ్మురేపేలా ఉంది. ఫ్యాన్స్ కిది పర్‌ఫెక్ట్ ట్యాగ్‌లైన్‌లా ఉంది. అదే సమయంలో కొటేషన్‌ మాత్రం సేమ్‌ ఉంది. `ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, అంతకు మించి` అనే సేమ్‌ ఉండటం విశేషం. త్వరలో షూటింగ్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఈ రోజు ఉదయం లేవడంతోనే తన ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు పవన్‌. ఈ పోస్టర్‌ చూసి అభిమానులకు పూనకాలు రావడం ఖాయమంటున్నారు నెటిజన్లు. అయితే గతంలో విడుదల చేసిన `భవదీయుడు భగత్‌ సింగ్‌` పోస్టర్‌కి ఆల్మోస్ట్ ఇది చాలా దగ్గరగా ఉండటం విశేషం. కొద్ది మార్పులను ఈ పోస్టర్‌ సూచిస్తుంది. అయితే ఇది `థెరి` రీమేక్‌గా రూపొందుతున్న ఫిల్మ్ నగర్ టాక్. చాలా రోజులుగా ఈ వార్తలు నెట్టింట, అటు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. 

`థెరి`లోని మెయిన్‌ పాయింట్‌ని తీసుకుని, దానికి `భవదీయుడు భగత్‌ సింగ్‌`లోని ఫ్లాట్‌ని కలిపి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌ అవుతుంది. ఏదేమైనా పవన్‌-హరీష్‌ కాంబినేషన్‌లో సినిమా ఇన్నాళ్లకు ఓ కొల్లిక్కి రావడంతో అటు అభిమానుల్లో, ఇటు దర్శకుడిలోనూ నూతనొత్తేజాన్నిస్తుంది. ఇక కొత్త పోస్టర్‌లో పవన్‌ని ఓ చేతితో హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ని పట్టుకుని, మరో చేతితో టీ గ్లాస్‌ పట్టుకుని ఉన్నారు. వెనకాల విద్యుత్‌ వైర్లు, కరెంట్‌ తయారు చేసే పరిశ్రమలున్నాయి. అలాగే కొంత కోల్‌ టచ్‌ కూడా ఉండటం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios