పవన్ కొత్త సినిమా `ఉస్తాద్ భగత్ సింగ్`.. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ రచ్చ.. పోస్టర్ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలే!
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. `ఉస్తాద్ భగత్ సింగ్`గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. లేటెస్ట్ పోస్టర్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. ఆదివారం పూట అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు పవన్. తన కొత్త సినిమాని ప్రకటించారు. హరీష్ శంకర్తో చేయాల్సిన సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి `ఉస్తాద్ భగత్ సింగ్` అనే టైటిల్ ఖరారు చేశారు. గతంలో హరీష్ శంకర్తో `భవదీయుడు భగత్ సింగ్` అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కథలో మార్పులు చేసి టైటిల్ కూడా మార్చినట్టు తెలుస్తుంది. తాజాగా `ఉస్తాద్ భగత్ సింగ్` అంటూ ఈ కొత్త సినిమాని ఆదివారం ఉదయం ప్రకటించారు. `మనల్ని ఎవడ్రా ఆపేది` అనే ట్యాగ్ లైన్ దుమ్మురేపేలా ఉంది. ఫ్యాన్స్ కిది పర్ఫెక్ట్ ట్యాగ్లైన్లా ఉంది. అదే సమయంలో కొటేషన్ మాత్రం సేమ్ ఉంది. `ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అంతకు మించి` అనే సేమ్ ఉండటం విశేషం. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఈ రోజు ఉదయం లేవడంతోనే తన ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాడు పవన్. ఈ పోస్టర్ చూసి అభిమానులకు పూనకాలు రావడం ఖాయమంటున్నారు నెటిజన్లు. అయితే గతంలో విడుదల చేసిన `భవదీయుడు భగత్ సింగ్` పోస్టర్కి ఆల్మోస్ట్ ఇది చాలా దగ్గరగా ఉండటం విశేషం. కొద్ది మార్పులను ఈ పోస్టర్ సూచిస్తుంది. అయితే ఇది `థెరి` రీమేక్గా రూపొందుతున్న ఫిల్మ్ నగర్ టాక్. చాలా రోజులుగా ఈ వార్తలు నెట్టింట, అటు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
`థెరి`లోని మెయిన్ పాయింట్ని తీసుకుని, దానికి `భవదీయుడు భగత్ సింగ్`లోని ఫ్లాట్ని కలిపి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఏదేమైనా పవన్-హరీష్ కాంబినేషన్లో సినిమా ఇన్నాళ్లకు ఓ కొల్లిక్కి రావడంతో అటు అభిమానుల్లో, ఇటు దర్శకుడిలోనూ నూతనొత్తేజాన్నిస్తుంది. ఇక కొత్త పోస్టర్లో పవన్ని ఓ చేతితో హార్లీ డేవిడ్సన్ బైక్ని పట్టుకుని, మరో చేతితో టీ గ్లాస్ పట్టుకుని ఉన్నారు. వెనకాల విద్యుత్ వైర్లు, కరెంట్ తయారు చేసే పరిశ్రమలున్నాయి. అలాగే కొంత కోల్ టచ్ కూడా ఉండటం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటించే అవకాశం ఉంది.