ఏబీఎన్ రాధాక్రిష్ణ పై విరుచుకుపడ్డ పవన్
ఎల్లో మీడియాను బహిష్కరించండి : పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ట్వీట్ల వార్ ను మరింత పెంచేశారు. టీవీ9 రవిప్రకాశ్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ లపై ఆయన గురి పెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి వీరిద్దరిపైనా ఘాటు ట్వీట్లు చేయటం షురూ చేశారు.‘ఎల్లో మీడియాను బహిష్కరించండి’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు పవన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘మన తల్లులను, బిడ్డలను, సోదరీమణులను దూషిస్తున్న టీవీ 9, టీవీ 5, ఏబీఎన్ లను బహిష్కరించండి. నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నందుకూ వాటిని మనం బహిష్కరించాల్సి ఉంది. నిస్సహాయురాలైన సోదరిని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు..’ అని పవన్ తన ట్వీట్ లో విమర్శించారు.
కాగా, పవన్ కల్యాణ్ మరికొన్ని ట్వీట్స్ లో ఏమన్నారంటే.. ‘త్వరలోనే సరదాగ , కాలక్షేపం కోసం “అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది. త్వరలోనే సరదాగా, కాలక్షేపం కోసం “అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం లో సింపుల్ చిట్ చాట్, గాసిప్, ఫొటోస్, వీడియోస్ మొదలైన వాటితో పాటు స్టీమీ అఫైర్స్ కూడా మా సాంబాస్ వరల్డ్ లో ఉంటాయి’ అని పేర్కొన్నారు.
#areyOsambaHukumSardar program will bring you some simple chitchat, gossip, photos, videos etc..from our Samba’s world.
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
త్వరలోనే సరదాగ , కాలక్షేపం కోసం “అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది ..i #areyOsambaHukumSardar
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
Welcome back to #BMBK program with PawanKalan ..Today our guest is Mr. RK who is MD of ?? ఆర్కే , నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా ? టీడీపీజ్యోతా ? ఎందుకంటే అది ఆంధ్రులకి సంబందించింది ఐతే కాదు .. అసలు ఎందుకంటున్నారో ఈ మాట అనేది వచ్చే కొద్దీర్ వారాల్లో ఒక స్పష్టత వస్తుంది..
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018
RK, please welcome to ““బట్టలూడదీసి మాట్లాడుకుందాం - బట్టలూడదూసి కొడదాం “ కార్యక్రమానికి మీకు స్వాగతం.. pic.twitter.com/Cu5iBsHQ4Y
— Pawan Kalyan (@PawanKalyan) April 22, 2018