Asianet News TeluguAsianet News Telugu

విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ ను వైరల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్

నిర్మాతలు.. పంపిణీ ఎగ్జిబిషన్ వర్గాలకు అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ..  టికెట్ ధరను పెంచుకోవడానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం మొత్తం రాజకీయమే అంటున్నారు బీజీపి నేత విష్ణు వర్దన్ రెడ్డి. 
 

Pawan fans viralizing Vishnu's tweet jsp
Author
Hyderabad, First Published Apr 10, 2021, 4:40 PM IST

దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘పింక్‌’కు రీమేక్‌గా వచ్చిన ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించారు. మొదటి షో నుంచే  పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వకీల్ సాబ్‌.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అంతటా ఈ సినిమా కబుర్లు చెప్పుకుంటూంటే,ఆంధ్రాలో మాత్రం ఈ సినిమా ని అడ్డం పెట్టి పెద్ద రాజకీయం జరుగుతోంది.

వకీల్ సాబ్ రిలీజ్ ముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఓ రేంజిలో డ్రామా జరిగింది. స్పెషల్ షోల అనుమతుల్ని, టికెట్ ధరల పెంపును రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆకస్మికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే జాయింట్ కలెక్టర్లు నేరుగా థియేటర్ యజమానులును,డిస్ట్రిబ్యూటర్స్ ని హెచ్చరిస్తూ నోటీసులు ఇచ్చారు. ఈ ఆకస్మిక పరిణామానికి పవన్ అభిమానులు షాక్ తిన్నారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లారు. దాంతో  వకీల్ సాబ్ నిర్మాతలు.. పంపిణీ ఎగ్జిబిషన్ వర్గాలకు అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ..  టికెట్ ధరను పెంచుకోవడానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం మొత్తం రాజకీయమే అంటున్నారు బీజీపి నేత విష్ణు వర్దన్ రెడ్డి. 

తిరుపతి ఉప ఎన్నికల వేళ బీజేపీకి మద్దతుగా రాజకీయం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తాజాగా జగన్ సర్కార్ టార్గెట్ అన్నారు. పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీకి జగన్ ప్రభుత్వం అడుగడగునా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్  గా మారింది. వైసీపీ సర్కార్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

‘వకీల్ సాబ్ కు మీరు షాకిస్తే.. తిరుపతిలో మీకు ఓటర్లు షాకివ్వబోతున్నారంటూ’ బీజేపీ నేత విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తిరుపతిలోపవన్ స్టామినా పవర్ చూసి తట్టుకోలేకనే ఆయన సినిమాను వైసీపీ సర్కార్ అడ్డుకుంటోందని విష్ణు ఆరోపించారు.

ఏపీలో ఇప్పుడు నడుస్తోంది వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు.. తిరుపతి ఎంపీ టికెట్ ఎన్నికల వ్యవహారం అంటూ బీజేపీ నేత విష్ణు
తన ట్వీట్లో విమర్శలు గుప్పించారు.

రాజకీయ అంశంగా వకీల్ సాబ్ కు సినిమా ద్వారా పవన్ గారికి షాకిస్తే 17న తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు, వారి అభిమానులు మీకు
షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోండి అంటూ విష్ణు తన ట్వీట్ లో విమర్శించారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు పవన్
అభిమానులు వైరల్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios