'సర్కార్ వారి పాట' కు పరుశరామ్ రెమ్యునేషన్
పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించారు. ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ ఫస్ట్ లుక్ వదిలారు.మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో పరుశరామ్ కు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారనేది మీడియా వర్గాల్లో చర్చగా మారింది. మహేష్ లాంటి స్టార్ హీరోని డైరక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా భారీ మొత్తమే ఇస్తారు. అయితే ఆ మొత్తం ఎంత..పరుశరామ్ కు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు. మొత్తం ఎంత పే చెయ్యబోతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, తొలి సారి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా ' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్న పరుశరామ్ ఈ సారి ఓ సరికొత్త సబ్జెక్టు తో మహేష్ ని మెప్పించారు. ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ ఫస్ట్ లుక్ వదిలారు.మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో పరుశరామ్ కు ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారనేది మీడియా వర్గాల్లో చర్చగా మారింది. మహేష్ లాంటి స్టార్ హీరోని డైరక్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా భారీ మొత్తమే ఇస్తారు. అయితే ఆ మొత్తం ఎంత..పరుశరామ్ కు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు. మొత్తం ఎంత పే చెయ్యబోతున్నారు.
సినీ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం పరుశరామ్ కు మొత్తం ముట్టేది పది కోట్లు. అడ్వాన్స్ గా రెండు కోట్లు ఇచ్చారని వినికిడి. ఈ మొత్తాన్ని మొత్తం మహేష్ సెట్ చేసాడని అంటున్నారు. డైరక్టర్ ఎంత ఆనందంగా ఉంటే అంత బాగా అవుట్ ఫుట్ వస్తుందని నమ్మే హీరో మహేష్ బాబు. దాంతో ఆయనే నిర్మాతలతో చెప్పి..పదికు సెట్ చేసి పరుశరామ్ ని ఆశ్చర్యపరిచాడని అంటున్నారు. అంత పెద్ద మొత్తం ఇస్తారని పరుశరామ్ కలలో కూడా ఊహించలేదని చెప్తున్నారు. కరోనా కనుక లేకపోతే పెద్ద పార్టీ ఇద్దుడు అని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కరోనా మన దేశంలో కంట్రోలులోకి వచ్చాక మొదలు కానుంది. అలాగే ఈ సినిమా బ్యాంకింగ్ రంగలోని ప్రాడ్స్ పై ఉండబోతోందని వినపడుతోంది. ఇక ఈ చిత్రం కథలో విలన్ ..ఇక్కడ కోట్ల రూపాయల బ్యాంక్ ప్రాడ్ చేసి అమెరికా వెళ్లి సెటిల్ అవుతాడు. అతన్ని ఇండియాకు తీసుకువస్తాడు హీరో అని తెలుస్తోంది. చిత్రం గురించి మహేష్ మాట్లాడుతూ..తన కొత్త చిత్ర కథా నేపథ్యం చక్కటి వినోదంతో పాటు బలమైన సందేశమున్న చిత్రమని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు కుదుటపడి.. సినిమా సెట్స్పైకి వెళ్లాకే విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
“14 రీల్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్” కలిసి ఈ సినిమా ని నిర్మించనున్నారు.సంగీతం తమన్ అందించబోతున్నాడట. అలాగే చాలా కాలం తర్వాత మహేష్ రొమాంటిక్ బాయ్ గా నటించబోతున్నాడు. మహేష్ ను ఒక మ్యాచుర్డ్ లవ్ స్టోరీలో చూపించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఉపేంద్ర విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.