మాల్వి మల్హోత్రా పై మరో కేసు... నా కొడుకును ట్రాప్ చేసి ఆస్తులు లాక్కుంది అంటూ, ప్రొడ్యూసర్ తల్లి ఫిర్యాదు!
తీగలాగితే డొకంతా కదులుతుంది. గతంలో కూడా కూడా హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై పలు వివాదాలు ఉన్నట్లు తెలుస్తుంది. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తల్లి మాల్వి మల్హోత్రా పై కేసు పెట్టింది.
హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకుందంటూ హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఈ మేరకు కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడు. శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. గుడిలో మాకు రహస్య వివాహం జరిగింది. రాజ్ తరుణ్ రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు అనేది లావణ్య ఆరోపణ.
లావణ్య ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ వన్, ఏ టు, ఏ త్రీగా నమోదు చేశారు. రాజ్ తరుణ్ కి నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఆయన పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాగా మాల్వి మల్హోత్రా పై మరో కేసు నమోదు అయ్యింది. గతంలో మాల్వి మల్హోత్రా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తో ఎఫైర్ నడిపింది.
ఇద్దరికి మనస్పర్థలు రాగా మాల్వి మల్హోత్రా పై యోగేష్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మాల్వి మల్హోత్రా గాయాలపాలైంది. యోగేష్ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. తాజాగా యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రా మీద కేసు పెట్టింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో నా కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసింది. మా ఆస్తులు కాజేసింది. వాడిని జైలుపాలు చేసిందని కంప్లైంట్ లో పేర్కొంది. గతంలో యోగేష్-మాల్వి మల్హోత్రా మధ్య సాగిన ఆడియో వీడియో కాల్స్ కి సంబంధించిన రికార్డులు ఆమె పోలీసులకు సమర్పించినట్లు సమాచారం.
ఇటు రాజ్ తరుణ్ కూడా లావణ్య కేసులో ఇరుక్కుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. లావణ్య ఆరోపణలు నిజమని నమ్మితే రాజ్ తరుణ్ అరెస్ట్ అయ్యే అవకాశం కలదు. రాజ్ తరుణ్-మాల్వి మల్హోత్రా జంటగా తిరగబడర సామీ మూవీ చేశారు. దర్శకుడు రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ కేసు నుండి రాజ్ తరుణ్ ఎలా బయటపడతాడనే ఉత్కంఠ నడుస్తుంది. లావణ్య ఆరోపణలు ఖండిస్తున్నా రాజ్ తరుణ్... చట్టపరంగా ఈ కేసును ఎదుర్కొంటాని అంటున్నాడు. లావణ్య డబ్బులిచ్చి కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మరో ఆరోపణ చేసింది...