Asianet News TeluguAsianet News Telugu

`ఓ తండ్రి తీర్పు` ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని ఆవిష్కరించిన మురళీ మోహన్‌.. టీమ్‌కి అభినందనలు..

మురళీ మోహన్‌ హీరోగా రూపొందిన `ఓ తండ్రి తీర్పు` సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. 37ఏళ్ల తర్వాత సరిగ్గా అదే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పోస్టర్‌ని మురళీమోహన్‌ ఆవిష్కరించడం విశేషం.

o thandri theerpu first look poster released by murali mohan
Author
First Published Dec 6, 2022, 8:33 PM IST

మురళీ మోహన్‌ హీరోగా రూపొందిన `ఓ తండ్రి తీర్పు` సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. 37ఏళ్ల తర్వాత సరిగ్గా అదే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పోస్టర్‌ని మురళీమోహన్‌ ఆవిష్కరించడం విశేషం. ఏవీకే ఫిల్మ్స్ బ్యానర్‌పై లయన్‌ ఆరిగపూడి విజయ్‌ కుమార్‌ సమర్పణలో లయన్‌ శ్రీరామ్‌ దత్తి `ఓ తండ్రి తీర్పు` చిత్రాన్ని నిర్మించారు. రాజేందర్‌ రాజు కాంచనపల్లి పర్యవేక్షణలో ప్రతాప్‌ భీమవరపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. 

`ఓ తండ్రి తీర్పు` పోస్టర్‌ ఆవిష్కరించిన సందర్భంగా నటుడు,నిర్మాత మురళీ మోహన్‌ హాట్లాడుతూ, `1985లో జయభేరి బ్యానర్లో నేను కథానాయకుడుగా నిర్మించిన `ఓ తండ్రి తీర్పు` ఘన విజయం సాధించింది. నంది అవార్డు కూడా వచ్చింది. అది నా సినీ జీవితంలో ఒక మైలు రాయి. ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే  టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించి అవార్డ్స్ అందుకుంటుంద`న్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. 

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీరామ్‌ దత్తి మాట్లాడుతూ, `మురళి మోహన్ సక్సెస్ ఫుల్ నిర్మాత.  నిర్మాతగా ఇది నాకు శుభ సూచకం . మురళీమోహన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు.  రచయిత, దర్శకులు ప్రతాప్ భీమవరపు  తండ్రిగా ప్రధాన పాత్రలో నటిస్తూ  చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణతో లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్  ఆశీస్సులతో  మంచి నిర్మాతగా  విజయవంతమయ్యే సినిమాలు నిర్మించాలన్నది నా ఆశయం.  నా ఆశయ సాధనలో పాలుపంచుకుంటున్న  రాజేంద్ర రాజు కాంచనపల్లి  గురించి ఎంత చెప్పినా తక్కువే.  అప్పగించిన పని బాధ్యతగా పోటీ పడి చేయటం మా రారాజు గొప్పతనం‌.  పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డిలో మంచి డిజైనరే కాదు నటుడు కూడా ఉన్నాడు. `ఓ తండ్రి తీర్పు` చిత్రంలో వివా రెడ్డి హీరో గా నటించడం విశేషం` అని తెలిపారు.

రచయిత, దర్శకులు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ, `ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను. మద్రాస్ లో నా సినీ జీవితం ప్రారంభం నుంచి మురళీమోహన్  నాకు ఇష్టమైన వ్యక్తి. మాదాల రంగారావు  `విప్లవ శంఖం` సినిమాకు వారితో కలిసి పని చేశాను. హీరోగా, నిర్మాతగా వారు సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. 37 సంవత్సరాల క్రితం విడుదలైన వారి `ఓ తండ్రి తీర్పు` చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే అదే టైటిల్ తో ఈ కథ రాసుకొని సినిమాగా తీస్తున్నాను. వారి బ్యానర్ లో వారే హీరోగా నటించి ఘన విజయం సాధించినట్టుగానే మా సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుంది అనడానికి వారి చేతుల మీదుగా పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం నిదర్శనం` అని తెలిపారు. 

పబ్లిసిటీ డిజైనర్ వివా రెడ్డి మాట్లాడుతూ, `సుమారు 600కు పైగా సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేసిన నాకుజీవితంలో గుర్తుండిపోయే ఒక మంచి సినిమాకు అవకాశం ఇచ్చిన కాంచనపల్లి రాజేందర్ రాజు అన్నయ్యకి హృదయపూర్వక కృతజ్ఞతలు.  నా కెరీర్ లో `ఓ తండ్రి తీర్పు` లాంటి గొప్ప సినిమాకి డిజైనర్ గా పనిచేయడం, ప్రధాన పాత్రలో నటించడం కేవలం రాజేందర్ రాజు అన్నయ్య వల్లనే సాధ్యమైంది. డిజైనర్ గా, నటుడిగా  ఈ సినిమా నాకు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీరామ్ దత్తి గారికి, దర్శకుడు ప్రతాప్ భీమవరపు గారికి రుణపడి ఉంటాను` అని వెల్లడించారు. 

పర్యవేక్షకులు కాంచనపల్లి రాజేంద్ర రాజు మాట్లాడుతూ, `దైవాంశ సంభూతులు, ప్రముఖ నిర్మాత దర్శకులు మురళీమోహన్  `ఓ తండ్రి తీర్పు` పోస్టర్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించడం సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. ఎంతో మంచి మనసుతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరిని పలకరించి ఆశీర్వదించడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. నటుడిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా మా తరానికి మురళీమోహన్ లాంటి వ్యక్తి ఒక స్ఫూర్తి` అని అన్నారు.

ప్రతాప్, శ్రీరామ్, రాజేంద్ర కుమార్, వివా రెడ్డి, కునాల్,కుషాల్, చిత్రం భాష,అనురాధ,రారాజు, సురభి శ్రావణి, పునర్వి, శివాజీ, రమ్యకృష్ణ, మంజుల, స్వాతి, జ్యోతి, కేవీఎల్ నరసింహారావు, లక్ష్మీనారాయణ,పేరిణి శ్రీకాంత్ ,గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు,మిమిక్రీ రాజు,రాము,అయ్యప్ప,ప్రమీల,అమృత వర్షిణి, సాయి చరణ్, సాయి తేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
నిర్మాత : శ్రీరామ్ దత్తి 
దర్శకత్వం : ప్రతాప్ భీమవరపు 
పర్యవేక్షణ : రాజేందర్ రాజు కాంచనపల్లి 
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సురేష్ చెటిపల్లి 
సంగీతం :బాపు శాస్త్రి,
పాటలు: హరితస, బిక్కీ కృష్ణ,
దాసరి వెంకటరమణ,
పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి 
కోఆర్డినేటర్ :రాపోలు దత్తాత్రి,
కో డైరెక్టర్ :శేషు కుమార్ , రంగనాథ్ కొత్తకోట, 
అసిస్టెంట్ డైరెక్టర్: బాలచందర్, మేనేజర్: రామకృష్ణ రాజు. ఆర్ట్ డైరెక్టర్ : దుద్దిపూడి ఫణి రాజు, ప్రొడక్షన్: శివ.

Follow Us:
Download App:
  • android
  • ios