లాస్‌ ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డు ఈవెంట్‌లో చిత్ర బృందంతోపాటు ఎన్టీఆర్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ హాలీవుడ్‌ రిపోర్టర్‌తో ముచ్చటించాడు ఎన్టీఆర్‌. ఆ విలేకరికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

తెలుగు ప్రతిష్టాత్మక మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` అంతర్జాతీయంగా సత్తా చాటుతుంది. ఇండియన్‌ సినిమాకి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. తాజాగా ఈ మూవీ ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు పాటకి అంతర్జాతీయ పురస్కారం రావడం ఇదే తొలిసారి. ఇదొక రికార్డ్. ఇది ఇండియన్‌ రికార్డ్ కూడా. `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటు నాటు` పాటకి గానూ ఈ పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు. దీంతో కీరవాణికి, `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది ఇండియన్‌ సినిమా గర్వపడే సందర్భంగా అభివర్ణిస్తున్నారు. 

ఇదిలా ఉంటే లాస్‌ ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డు ఈవెంట్‌లో చిత్ర బృందంతోపాటు ఎన్టీఆర్ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ హాలీవుడ్‌ రిపోర్టర్‌తో ముచ్చటించాడు ఎన్టీఆర్‌. `వెరైటీ` అనే మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్‌లో అదరగొట్టారు. హాలీవుడ్‌ యాక్టర్‌ స్టయిల్‌లో ఆయన మాట్లాడుతుంటే ముచ్చటేసిందని చెప్పొచ్చు. ఆ స్లాంగ్‌, ఆ స్పీడ్‌ వాహ్‌ అనిపించేలా ఉంది. ఎన్టీఆర్ మాటలకు ఆ రిపోర్టర్‌ సైతం ఆశ్చర్యపోయాడు. `నాటు నాటు` పాటకి అవార్డు రావడం పట్ల తారక్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది తాము ఊహించలేదని, ఎవరూ ఊహించి ఉండరని తెలిపారు. ఇది అవార్డుని మించిన ఆనందమని తెలిపారు. రాజమౌళితో పనిచేయడంపై తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు. 

చివరగా ఆ రిపోర్టర్‌కి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు తారక్‌. ఆ రిపోర్టర్‌ పుట్టిన రోజు నేడు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరీ బర్త్ డే విశేష్‌ చెప్పారు. ఊరికే మాటల్లో విషెస్‌ కాదు, ఓ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చి మరీ విషెస్‌ చెప్పడం విశేషం. దీంతో తారక్‌ ఇచ్చిన గిఫ్ట్ చూసి నోరెళ్లబెట్టాడు ఆ సదరరు రిపోర్టర్‌. ఆ వెంటనే ఆనందం తట్టుకోలేక ఎన్టీఆర్‌ని హగ్‌ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా వైరల్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ గొప్ప మనసుని అభినందిస్తున్నారు నెటిజన్లు, అభిమానులు. 

Scroll to load tweet…

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కొమురంభీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఓ ఫిక్షన్‌ కథతో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని రూపొందించారు. గతేడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచింది.