Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కొత్త బిజినెస్, క్లిక్ అవుతుందా?

నాగార్జున స్టూడియో, నిర్మాణంతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మహేష్. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ సైతం కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నారట. ఆ బిజినెస్ ఏంటంటే ‘యువ’ అనే టీవీ ఛానెల్.

NTR News Channel YUVA Soon?
Author
Hyderabad, First Published Jun 21, 2020, 9:44 AM IST

నాగార్జున స్టూడియో, నిర్మాణంతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మహేష్. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ సైతం కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నారట. ఆ బిజినెస్ ఏంటంటే ‘యువ’ అనే టీవీ ఛానెల్.
 
ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ గా హల్ చల్ చేస్తున్న న్యూస్ ఏమిటీ అంటే ఎన్టీఆర్ సొంతంగా టీవి ఛానెల్ పెట్టబోతున్నారు అనేది. ఆ టీవీ ఛానెల్‌ పేరు ‘యువ’ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ‘యువ’ అనే ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, దాని రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తుందని సమాచారం. మొత్తానికి ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులకు  ఆసక్తికరంగా అనిపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ప్రణతి తండ్రి, నార్నే శ్రీనివాస రావు సోదరి ఈ ఛానెల్ లో కొంత షేర్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం, ఛానెల్ యొక్క టెస్టింగ్ జరుగుతోంది మరియు ఇది అతి త్వరలో ప్రసారాలు ప్రారంభిస్తుంది. 

ఎన్టీఆర్ మామగారైన నార్నె శ్రీనివాస రావుకి ఇప్పటికే ఒక టీవీ ఛానల్ ఉంది. అయితే ఎన్టీఆర్ ఆ ఛానెల్ కు అనుసంధానంగా తన  కొత్త ఛానెల్ ప్రారంభించబోతున్నాడని..చెప్తున్నారు. టెక్నికల్, స్టాఫ్ వంటి విషయాలన్ని నార్నె శ్రీనివాసరావు చూసుకోబోతున్నారట. అయితే ఎన్టీఆర్ పెద్దగా ఇన్వాల్వ్ కాడని, తన కెరీర్ నుంచి దృష్టి ప్రక్కకు పెట్టేది లేదని క్లియర్ గా చెప్పారట. ఫైనాన్సియల్ గా అవసరమైతే మనీ ఎడ్జెస్ట్ చేయటం తప్ప మిగతావి పట్టించుకోదలుచుకోలేదుట. ఈ నేపధ్యంలో భవిష్యత్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఛానెల్ ఉపకరిస్తుందని కొందరు ఇప్పటినుంచే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో  కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం తరువాత, అతను తన తదుపరి ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టనున్నారు. త్రివిక్రమ్ చిత్రం తర్వాత కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సినిమా చేయడానికి కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ లాక్ డౌన్ బ్రేక్ కారణంగా ఎన్టీఆర్ కూడా కథా చర్చలు జరుపుతున్నాడని చెప్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios