ఎన్టీఆర్, మహేష్ ఫ్యాన్స్ మధ్య మంటపెట్టిన చంద్రబాబు ట్వీట్
నిన్న మహేష్ పుట్టినరోజును ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఘనంగా నిర్వహించారు. మహేష్ తన 45వ పుట్టినరోజు జరుపుకోగా అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విశెష్ చెప్పారు. ఐతే చంద్రబాబు మహేష్ కి విశెష్ చెప్పడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపానికి కారణం అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ నిన్న తన 45వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ఈ వేడుకను సోషల్ మీడియాలో ఘనంగా నిర్వహించారు మహేష్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక వేడుకలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ ని వేడుకోవడం జరిగింది. దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన బర్త్ డే ఘనంగా ముగించారు. ఏకంగా 60.2 మిలియన్స్ బర్త్ డే ట్వీట్స్ తో వారు నయా రికార్డు సెట్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు, కొందరు రాజకీయ నాయకులు కూడా మహేష్ కి తమ బెస్ట్ విశెష్ తెలియజేశారు. కాగా ఈ లిస్ట్ లో నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బాబు మహేష్ ని అధ్బుత నటుడిగా వర్ణించడంతో పాటు, జన్మదిన శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్ చేశారు.
ఈ గొడవ ఎలా ఉన్నా, ఎన్టీఆర్ మాత్రం మహేష్ కి బర్త్ డే విశెష్ తెలియజేశారు. మహేష్ ని అన్న అని సంభోదించిన ఎన్టీఆర్, ఆయన భవిష్యత్ బాగుండాలని కోరుకున్నారు. కొన్నాళ్లుగా పరిశ్రమలో ఎన్టీఆర్, మహేష్ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఇటీవల మహేష్ ని ఓ లాంగ్ ట్రిప్ కి వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్ళాలి అనుకుంటారు అని అడుగగా, ఎన్టీఆర్, చరణ్ పేర్లు చెప్పడం విశేషం. పరిశ్రమలో ఇంత మంచి మిత్రులుగా ఉన్న మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చంద్రబాబు ట్వీట్ మంట పెట్టినట్లు అయ్యింది. చంద్రబాబు కూడా అనవసరంగా కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు అయ్యింది.