Asianet News TeluguAsianet News Telugu

#Devara తెలుగులో ఎంత బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నారంటే...?

 సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Ntr #Devara makers how much business expecting from Telugu states jsp
Author
First Published Jan 2, 2024, 7:51 AM IST


ఎన్టీఆర్ ఆర్ .ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై   ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.ముఖ్యంగా దేవర ఫస్ట్ గ్లింప్స్ జనవరి 8న రానుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని తారక్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో తారక్ మాస్ అవతారంలో కనిపించి ఫ్యాన్స్ కు పండగ చేసారు. ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన తర్వాత బిజినెస్ ఓపెన్ చేస్తారని తెలుస్తోంది. ఆ గ్లింప్స్ అదిరిపోతాయని, ఎంత రేటు పెట్టైనా ఈ సినిమాని కొనుక్కోవాలనిపించేలా కట్ చేసారని వినిపిస్తోంది. 

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో  బ్లాక్ డ్రెస్ లో టక్ చేసుకుని పడవలో సముద్రం నుండి వస్తున్నట్టుగా ఉన్నారు. ఈ పవర్ ఫుల్ లుక్ మాస్ ఆడియన్స్ ను, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దేవర గ్లిప్స్ దిగాక బిజినెస్ రికార్డుల వేట మొదలవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  అంతా బాగానే ఉంది..మరి నిర్మాతలు ఏ ఏరియా నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారో చూద్దాం.

అందుతున్న సమాచారం మేరకు ...దేవర నిర్మాతలు 145 కోట్ల బిజినెస్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చే పెద్ద ప్యాన్ ఇండియా చిత్రం కాబట్టి భారీ బడ్జెట్ పెడుతున్నారు.  దాంతో బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ ఆ స్దాయిలోనే ఉంటాయి.  ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కు బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ చూస్తే... ఆంధ్రా నుంచి 65 కోట్లు, సీడెడ్ నుంచి 25 కోట్లు, నైజాం నుంచి 55 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది. ఖచ్చితంగా నెగోషియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ గా ఎంతకు బిజినెస్ డీల్స్ సెట్ అవుతాయో చూడాలి.
   
ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios