#Devara ఓవర్ సీస్ ఎంతకు అడుగుతున్నారు, ఎంత చెప్తున్నారు?
ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ కోసం ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నం చేస్తున్నారు. 25 కోట్లు దాకా వాళ్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు వినికిడి.
![Ntr #Devara makers how much business expecting from overseas rights jsp Ntr #Devara makers how much business expecting from overseas rights jsp](https://static-ai.asianetnews.com/images/01hk1tw5zf2388y67s4vjafzy4/devara-glimpse-1-jpg_363x203xt.jpg)
ఎన్టీఆర్ ఆర్ .ఆర్.ఆర్ తర్వాత చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా దేవర ఫస్ట్ గ్లింప్స్ జనవరి 8న వచ్చిన తర్వాత రెట్టింపు అవుతాయని భావిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన తర్వాత బిజినెస్ ఓపెన్ చేస్తారు. ఆ గ్లింప్స్ అదిరిపోతాయని, ఎంత రేటు పెట్టైనా ఈ సినిమాని కొనుక్కోవాలనిపించేలా కట్ చేసారని అంటున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే బిజినెస్ స్టార్టైంది. ఇక ఓవర్ సీస్ బిజినెస్ కూడా ఎంక్వైరీలు మొదలయ్యాయని వినికిడి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ కోసం ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్ ప్రయత్నం చేస్తున్నారు. 25 కోట్లు దాకా వాళ్లు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు వినికిడి. అయితే నిర్మాతలు మాత్రం ఓవర్ సీస్ రైట్స్ నుంచి 30 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నారట. టీజర్ వచ్చాక ...30 కోట్లు ఇవ్వటానికి నెగోషియేట్ చేయరనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారట.
అదే విధంగా ...దేవర నిర్మాతలు 145 కోట్ల బిజినెస్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చే పెద్ద ప్యాన్ ఇండియా చిత్రం కాబట్టి భారీ బడ్జెట్ పెడుతున్నారు. దాంతో బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ ఆ స్దాయిలోనే ఉంటాయి. ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ కు బిజినెస్ ఎక్సపెక్టేషన్స్ చూస్తే... ఆంధ్రా నుంచి 65 కోట్లు, సీడెడ్ నుంచి 25 కోట్లు, నైజాం నుంచి 55 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు ట్రేడ్ లో వినిపిస్తోంది. ఖచ్చితంగా నెగోషియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ గా ఎంతకు బిజినెస్ డీల్స్ సెట్ అవుతాయో చూడాలి.
ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.