జైలవకుశలో మూడో హీరోయిన్ ఎందుకు లేదో చెప్పిన ఎన్టీఆర్
- ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంత తెరకెక్కిన మూవీ జైలవకుశ
- ఈ శుక్రవారం రిలీజ్ కానున్న జై లవకుశ
- ఫుల్ ప్రమోషన్, ఎక్కడ చూసినా జై లవకుశ
- ముగ్గురు ఎన్టీఆర్ లకు ఇద్దరే హీరోయిన్లపై ఎన్టీఆర్ క్లారిటీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైలవకుశ. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ విశేషాలను మీడియాకు వివరిస్తూ.. ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఓ వైపు బిగ్ బాస్ షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ.. ప్రేక్షకుల గుండెల్లో మరింత దగ్గరిగా స్థానం సంపాదిస్తూ.. మన అనిపించుకుంటూ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నారు.
ఇక 'జై లవకుశ' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ను ముమ్మరం చేశారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ కూడా యాక్టివ్గా ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లెక్క ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండాలి
కానీ రాశిఖన్నా, నివేదా థామస్లు ఇద్దరు మాత్రమే ఈ సినిమాలో హీరోయిన్స్ అని చిత్రబృందం వెల్లడించింది. దీంతో నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రకు హీరోయిన్ ఉండదా? అనే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించగా ఆయనొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ను రివీల్ చేశారు.
సినిమాలో జై పాత్రకు కూడా లవ్ యాంగిల్ ఉంటుందట. జై, కుశ పాత్రలు నివేదా థామస్ను ప్రేమిస్తారట. నివేదా మాత్రం కుశతో ప్రేమలో ఉంటుంది. అంటే నివేదా కోసం అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతుందేమో.. రాశిఖన్నా మాత్రం లవకుమార్కు జోడీ అని క్లారిటీ ఇచ్చేశాడు ఎన్టీఆర్.
ఇక 'స్పైడర్' సినిమాతో పోటీ పట్ల స్పందిస్తూ 'సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ ఒకేసారి వంద సినిమాలు విడుదలైనా ఆడతాయనే' నమ్మకాన్ని వ్యక్తం చేశారు.