Asianet News TeluguAsianet News Telugu

‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం

గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. 

NTR and kalyan ram donated money to CM relief fund
Author
Hyderabad, First Published Oct 15, 2018, 1:00 PM IST

 ‘తిత్లీ’ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు అగ్ర కథానాయకులు , నందమూరి సోదరులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు ఆర్థిక సాయం అందించారు.  ఎన్టీఆర్.. రూ.15లక్షలు, కల్యాణ్‌ రామ్‌ రూ.5 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి. గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో తారక్‌ రూ.25 లక్షలు ఇవ్వగా కల్యాణ్‌రామ్‌ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

‘తిత్లీ’ బాధితులకు యువకథానాయకుడు విజయ్‌ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా సాయం చేశారు. విజయ్‌ రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు. అనిల్‌ లక్ష రూపాయలు సీఎం నిధికి అందించారు. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ‘తిత్లీ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ రెండు జిల్లాల్లోని దాదాపు పన్నెండు మండలాల్లో ‘తిత్లీ’ తీవ్ర నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios