జాక్వలిన్ ఫెర్నాండెజ్పై 200 కోట్లకి పరువు నష్టం దావా వేసిన నోరా ఫతేహీ
తన కెరీర్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తోందంటూ... బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్పై నోరా ఫతేహీ, పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తన జీవితం నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందంటూ..జాక్వలిన్ ఫెర్నాండెజ్పై నోరా ఫతేహీ, పరువు నష్టం కేసు దాఖలు చేసింది. తన మూవీ కెరీర్ ను బ్రేక్ చేయడానికే ఇదంతా చేస్తోందంటూ.. నోరా తన పిటిషన్లో పేర్కొంది. గతంలో మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ను ఈడీ అధికారులు విచారించారు. ఈ మనీలాండరింగ్ కేస్ లో ఏ1 గా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్తో ఈ ఇద్దరు తారలు టచ్లో ఉన్నారని.. అంతే కాకుండా అతడి నుంచి ఖరీదైన బహుమతులు కూడా వీరు పొందారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ కేసులో చాలా సార్లు జాక్వలిన్ ఫెర్నాండెజ్పై నోరా ఫతేహీ విచారణను ఫేస్ చేశారు కూడా. దాంతో బాలీవుడ్ లో ఈ విషయం ప్రకంపణలు పుట్టించింది. ముంబయ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొంత కాలం క్రితం కోర్టుకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ రాసిన ఓ లేఖ ఈ వివాదానికి కారణం అయ్యింది. ఆ లేఖలో జాక్వలిన్ నోరా ఫతేహీ పేరును ప్రస్తావించింది. సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి నోరా ఫతేహీ కాస్ట్రీగిఫ్ట్స్ ను భారీగా తీసుకున్నదని ఆ లేఖలో రాసుకొచ్చింది. దాంతో ఈ విషయంలో నోరా ఫతేహీకి జాక్వలిన్ పై కోపం వచ్చింది.
ఆ లేఖలో తన పేరు ప్రస్తావించడంతో నోరా ఫతేహీ మండిపడింది. సుఖేశ్ చంద్రశేఖర్తో తనకు ఎటువంటి సంబంధం లేదని, అతని భార్యతోనే తనకు పరిచయం ఉందని నోరా ఫతేహీ క్లారిటీ ఇచ్చారు.సుకేష్ చంద్రశేఖర్ నుంచి తాను ఎలాంటి బహుమతుల్ని తీసుకోలేదని తాజాగా స్పష్టం చేసిన నోరా . జాక్వెలిన్ కావాలనే తనని ఆ కేసులోఇరికించినట్లు అందులో పేర్కొంది.
అంతే కాదు జాక్వెలిన్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా.. తనకు కొన్ని షోలు, యాడ్స్ చేసే అవకాశం చేజారినట్లు నోరా ఫతేహి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్పై 200 కోట్లకి పరువు నష్టం దాఖలు చేసింది. అంతేకాదు.. జాక్వెలిన్ చెప్పినట్లు మనీ లాండరింగ్లో తన పేరుని రాసిన కొన్ని మీడియా సంస్థల పేర్లని కూడా ఆమె ఆ దావా స్టేట్మెంట్లో పొందుపరిచింది.