స్టార్ హీరో పెళ్లి.. గెస్ట్ ల పోన్లకు స్టిక్కర్లు!అంతకు ముందు యాక్సిడెంట్
వరుణ్ ధావన్- నటాషాలకు స్కూల్ డేస్ నుండే పరిచయం ఉంది. తొలిసారి ఆమెను చూసి ఫిదా అయిన వరుణ్ ధావన్ ఆమెకు మూడు సార్లు ప్రపోజ్ చేయగా, రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఒప్పుకున్న నటాషా ఎట్టకేలకు వరుణ్ భాగస్వామిగా మారింది.
మొత్తానికి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇంటివాడు అయిపోయాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాశా దలాల్ తో ఏడడుగులు వేసి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. ముంబై అలిబాగ్ లోని రెస్టారెంట్ లో చాలా కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య జరిగిన ఈ వివాహ మహోత్సవం వైభవంగా జరగగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వరుణ్.
లైఫ్ లాంగ్ లవ్ అఫిషియల్ అయిపోయింది అంటూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే ఇదే సమయంలో ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ వివాహంలో ..తీసుకున్న జాగ్రత్తలు గురించి ఆ వార్త.
ఈ పెళ్లిలో ఫొటోలు తీయకుండా ఆ వివాహ ఏర్పాట్లను చూసుకునే సిబ్బంది సెల్ఫోన్లకు స్టిక్కర్లు వేశారట. స్టిక్కర్లు తీసిన వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం వెళ్లేలా ఏర్పాట్లు చేశారట. ఈ వార్త కాస్త సోషల్మీడియాకి చిక్కడంతో కొంతమంది నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తన సినిమాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా.? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, దాన్ని సీక్రెట్ గా ఉంచుకోవాలని కోరుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు.
అలాగే పెళ్లికి కొన్ని గంటల ముందు ఈయన కారు ప్రమాదానికి లోనైంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగింది అంటూ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. కాకపోతే ఎవరూ ఎలాంటి గాయాల పాలు కాకపోవడం.. ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్ ధావన్ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే చిన్న ప్రమాదం కావటంతో కారులో ఉన్న వాళ్లెవరికి గాయాలు కాలేదు.