ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా సామరస్య పూర్వక పరిష్కారం లభించే వరకు షూటింగ్లు జరగవు. దీంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉండగా, మరికొన్ని చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.
తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రోజు అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి బంద్ అవుతోంది. షూటింగ్లన్నీ నిలిపివేస్తున్నామని దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలసిందే. అయితే రెండు సినిమాలు షూటింగ్ లు మాత్రం ఆగలేదు. అందులో ఒకటి విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రం. ఈ చిత్రంపై ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రభావం లేదు. ఎందుకంటే ఈ సినిమా బైలింగ్వుల్ కాదని, కేవలం తమిళంలో మాత్రమే షూట్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ ఏరియాలో ఈ రోజు షూటింగ్ జరుపుకుంటోందని సమాచారం.
అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఛత్రపతి చిత్రం రీమేక్ సైతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ వారం అంతా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇవి ప్రక్కన పెడితే టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడం.. ఓటీటీల్లో సినిమాలు రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతుండటం..పెద్ద హీరోల రెమ్యునరేషన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల పారితోషికాలు హద్దులు దాటడం..దీంతో సినిమా బడ్జెట్ కూడా నిర్మాతలు కంట్రోల్ చేయలేని పరిస్థితులు తలెత్తడం.. వంటి పలు కారణాలతో చాలా రోజులుగా నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇవన్నీ సెట్ అయ్యాకే సినిమా షూటింగ్ లు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఈ రోజు (ఆగష్టు 1) నుండి సినిమా షూటింగ్ లు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి. పరిశ్రమ ప్రయోజనాల దృష్ట్యా సామరస్య పూర్వక పరిష్కారం లభించే వరకు షూటింగ్లు జరగవు. దీంతో సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉండగా, మరికొన్ని చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సి ఉంది.
మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా బసిరెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఈసీ మెంబర్స్కు ఓటు హక్కు ఉండగా 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 22ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై గెలుపు సాధించారు బసిరెడ్డి. ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేసింది ఫిలిం ఛాంబర్.
