నాని ని నైస్ గా తప్పించి...నితిన్ సీన్ లోకి
ఇది పోటీ ప్రపంచం. ఒకరిని మించి మరొకరు ఎదగాలనే ఆకాంక్ష అందరిలో ఉంటుంది. పైకి స్నేహంగా ఉన్నా లోపల ఎవరి లాభాపేక్ష వారిదే. ఓ సూపర్ హిట్ చిత్రం వచ్చిందంటే దాని రైట్స్ కోసం ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చివరికి ఆ రైట్స్ దక్కించుకునేవారే హీరో అన్నట్లు తయారైంది.
ఇది పోటీ ప్రపంచం. ఒకరిని మించి మరొకరు ఎదగాలనే ఆకాంక్ష అందరిలో ఉంటుంది. పైకి స్నేహంగా ఉన్నా లోపల ఎవరి లాభాపేక్ష వారిదే. ఓ సూపర్ హిట్ చిత్రం వచ్చిందంటే దాని రైట్స్ కోసం ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చివరికి ఆ రైట్స్ దక్కించుకునేవారే హీరో అన్నట్లు తయారైంది.
ప్రస్తుతం తెలుగులో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రజలకు మంచి డిమాండ్ కనపడుతోంది. రీసెంట్ గా వచ్చిన `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`, `రాక్షసుడు`, `ఎవరు` వంటి సినిమాలు మంచి సక్సెస్ గా నిలిచిన నేపథ్యంలో అలాంటి కథల కోసం తెలుగు నిర్మాతలు గాలిస్తున్నారు. వేరే భాషల్లో వచ్చిన సినిమాలను రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ క్రమంలో తెలుగు నిర్మాతల దృష్టి సూపర్ హిట్ హిందీ చిత్రం `అంధాదున్`పై పడింది. ఈ సినిమాని నానితో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే అడవి శేషు ని హీరోగా పెట్టి చేద్దామని కొంతమని ప్రయత్నం చేసారు. అయితే ఈ సినిమా రీమేక్ రైట్ల కోసం పోటీ పడ్డా చివరికి హీరో నితిన్ చాలా పెద్ద మొత్తానికి ఆ సినిమా రీమేక్ రైట్లను దక్కించుకున్నారట.
హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు వయాకామ్ 18 సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం... తెలుగులో ప్రస్తుతం థ్రిల్లర్ల హవా నడుస్తుండడం ఆ సినిమాలు కాసుల పంట కురిపించడం కూడా దీనికి కారణం.
మరో ప్రక్క ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా అత్యాద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని హీరో ప్రశాంత్ తండ్రి, నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా పాత్రలో ప్రశాంత్ నటించనున్నారు.