యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే నితిన్ మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే నితిన్ మరో చిత్రాన్ని కూడా పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కిక్, రేసుగుర్రం లాంటి చిత్రాలకు కథలు అందించిన రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వీరి క్రేజీ కాంబినేషన్ లో చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభం అయింది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలోనే ఈ చిత్రం నిర్మించబడనుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, వెంకీ కుడుముల అతిథులుగా హాజరయ్యారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. శ్రీలీల కూడా మూవీ లాంచ్ లో మెరిసింది. సురేందర్ రెడ్డి తొలి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి, ఠాగూర్ మధు స్క్రిప్ట్ ని దర్శకుడు వక్కంతం వంశీకి అందించారు.
ముహూర్తపు దృశ్యాలని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నా 32వ చిత్రం కోసం వక్కంతం వంశీ గారి దర్శకత్వంలో నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన చిత్రం అని నితిన్ పోస్ట్ పెట్టాడు.
వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'జూనియర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వక్కంతం వంశీ రచయితగా సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన నా పేరు సూర్య చిత్రం నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీనితో ఈసారి ఎలాగైనా దర్శకుడిగా నిరూపించుకోవాలని వంశీ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.