Asianet News TeluguAsianet News Telugu

దర్శకుడు మృతి అంటూ ట్వీట్‌ చేసిన రచయిత‌‌.. ఖండించిన హీరో

దర్శకుడు నిశికాంత్ కామత్‌ ఈ నెల 11న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం తీవ్రం కావటంతో సోమవారం తుదిశ్వాస విడిచినట్టుగా ఆయన సహరచయిత మిలాప్‌ జవేరి ట్వీట్‌ చేయటంతో ఆ వార్త వైరల్‌గా మారింది.

Nishikant Kamat Director of Drishyam Dies at 50 Of Liver Cirrhosis
Author
Hyderabad, First Published Aug 17, 2020, 12:50 PM IST

సినీ ఇండస్ట్రీలో విషాదాలు కొనసాగుతున్నాయి. అజయ్‌ దేవగన్‌ హీరోగా దృశ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నిశికాంత్ కామత్‌ ఈ నెల 11న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్యం తీవ్రం కావటంతో సోమవారం తుదిశ్వాస విడిచినట్టుగా రచయిత మిలాప్ జవేరి ట్వీట్ చేశారు. ఆయన మృతికి లివర్‌ సిరోసిస్‌ కారణమని ఆయన ట్వీట్‌లో వెల్లడించారు.
Nishikant Kamat Director of Drishyam Dies at 50 Of Liver Cirrhosis

ఈ సందర్భంగా ఆయన నిశికాంత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుధీర్ఘ పోస్ట్ చేశాడు మిలాప్. అయితే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ ఈ వార్తను ఖండించాడు. ప్రస్తుతం నిశికాంత్‌కు వెంటిలేటర్‌ మీద చికిత్స జరుగుతుందని, రూమర్స్‌ స్ప్రెడ్ చేయవద్దని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios