అపార్ట్ మెంట్‌లో గొడవ గురించి తనపై మీడియా సంస్థల్లో వస్తోన్న వార్తలపై చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. తనపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయని, కానీ తానే ముందుగా ఫిర్యాదు చేశానని చైతన్య చెప్పారు. 

తన అపార్ట్ మెంట్‌లో జరిగిన వివాదంపై నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించారు. ఆయన ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తానే ముందుగా పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సోషల్‌ మీడియాలో, మీడియా సంస్థల్లో వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తనపై కేసు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయని, కానీ తానే ముందుగా ఫిర్యాదు చేశానని చైతన్య చెప్పారు. అపార్ట్‌మెంట్‌లోని దాదాపు ముప్పై మంది వచ్చి తమ డోర్ కొట్టడంతో తానే ఫిర్యాదు చేశానని చెప్పారు.

ఫ్లాట్ ఓనర్‌కు, అపార్ట్‌మెంట్ వాసులకు మధ్య మిస్ కమ్యూనికేషన్‌ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. ఫ్లాట్‌ను రెంట్‌కు తీసుకున్న పర్పస్ గురించి తాను ఓనర్‌కు తెలియజేశానని, ఆ విషయం అపార్ట్‌మెంట్ వాసులకు తెలియకపోవడం వల్లే గొడవకు వచ్చారని చెప్పారు. ఇరువురు మాట్లాడుకుని చర్చించుకున్నామని తెలిపారు. తాము కమర్షియల్ ఆఫీసుగా వాడుకోవడం మిగతా ఫ్లాట్ వాళ్లకి ఇబ్బందికరంగా ఉందని చెప్పారని, అందుకే తాము ఈనెల 10న ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చైతన్య వెల్లడించారు.

చైతన్య ఫ్రెండ్స్ తో ప్రతి రోజు రాత్రి మందు తాగుతూ, చిందులేసే వారని, ఇది సహించలేని అపార్ట్ మెంట్‌ వాసులు చైతన్యని నిలదీశారని, దీంతో రెండు రోజుల క్రితం అర్థరాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాల వారికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలోనే అపార్ట్ మెంట్‌ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత నిహారిక భర్త చైతన్య కూడా వారిపై ఫిర్యాదు చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య స్పందించి క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఇరు వర్గాల వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి రాజీ కుదిర్చినట్టు తెలుస్తుంది.