Asianet News TeluguAsianet News Telugu

రాయల్టీపై గళమెత్తిన గాయకులు: బాలసుబ్రహ్మణ్యం ఆవేదన

రాయల్టీపై సినీ గాయకులు గళమెత్తారు.ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌(ఇశ్రా) సమావేశంలో బుధవారం ఈ చట్టంపై చర్చించారు. ఈ సమావేశానికి పలువురు గాయనీగాయకులు హాజరయ్యారు. 

news, telugu news, latest telugu news, balasubrahmaniam, singers

హైదరాబాద్‌: రాయల్టీపై సినీ గాయకులు గళమెత్తారు.ఇండియన్‌ సింగర్స్‌ రైట్స్‌ అసోసియేషన్‌(ఇశ్రా) సమావేశంలో బుధవారం ఈ చట్టంపై చర్చించారు. ఈ సమావేశానికి పలువురు గాయనీగాయకులు హాజరయ్యారు. సమావేశానంతరం బాలు మీడియాతో మాట్లాడారు.

రాయల్టీ చట్టంపై గాయనీ గాయకులంతా అవగాహన కలిగివుండాలని సూచించారు. పాటలపై నిర్మాత, సంగీత దర్శకుడు, గేయ రచయితలకు మాత్రమే హక్కులు ఉన్నాయని చెప్పారు. కేవలం లతా మంగేష్కర్‌ మాత్రమే ఒప్పందంలో రాయల్టీ కుదుర్చుకునేవారని చెప్పారు. కానీ, 2012లో వచ్చిన రాయల్టీ చట్టం గాయనీ గాయకులు అందరికీ పాటలపై హక్కులు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

గాయనీ గాయకులంతా ఏకమైన రాయల్టీ తీసుకునేందుకు కృషి చేయాలని చెప్పారు. సినిమా పాటలకు సంబంధించి తనకు ఒక్క రూపాయి రాయల్టీ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పాటలకు రాయల్టీ చెల్లిస్తే ఎప్పుడో రిటైర్ట్ అయ్యేవాడినని అన్నారు. 

రాయల్టీ చట్టం ప్రకారం పాట లాభాల్లో గాయనీ గాయకుల నాణ్యమైన వాటా చెల్లించాలని చెప్పారు. రాయల్టీ యాక్టు కాపీ రైట్ యాక్టులా తయారైందని వివరించారు. దాదాపు 410 మంది సింగర్‌లు ఇశ్రాలో ఉన్నట్లు చెప్పారు. రాయల్టీ అనేది కేవలం సినిమా పాటలకే కాకుండా అన్ని రకాల పాటలకు వర్తిస్తుందని చెప్పారు. 

ఒక పాటను రీ-మిక్స్ చేయాలంటే ఐపీఆర్‌ఎస్‌ నుంచి పర్మిషన్‌ తీసుకోని చేయాలని తెలిపారు. లేకపోతే దానిపై లీగల్‌గా ముందుకెళ్తామని చెప్పారు. మైనెస్ 1 ట్రాక్ పాడినా.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనుమతి తీసుకోవాలని చెప్పారు. చనిపోయిన సింగర్లు పాడిన పాటలకు కూడా రాయల్టీ వస్తుందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios