Asianet News TeluguAsianet News Telugu

నితిన్ సినిమాలో నయనతార, చిన్న ట్విస్ట్

ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.
 

Nayantara in Andhadhun Remake?
Author
Hyderabad, First Published Aug 5, 2020, 4:55 PM IST

బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’ చిత్రం తెలుగులో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతోంది. బి.మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆ కొద్ది నెలల క్రితం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.  అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా గురించిన వార్తలు మాత్రలకు మాత్రం గ్యాప్ రావటం లేదు.తాజాగా ఈ చిత్రం గురించి వచ్చిన ఓ వార్త సిని ప్రియులను ఆనందపరుస్తోంది.

అదేమిటంటే...ఈ సినిమాలో నయనతార నటించే అవకాసం ఉంది. ఈ మేరకు ఆమెతో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆమె రెమ్యునేషన్ దగ్గరే బండి ఆగింది. ఆమె నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో సింపుల్ బడ్జెట్ లో తేల్చేద్దామనుకున్న ఈ సినిమా ఒక్కసారిగా నిర్మాతలను ఉలిక్కిపడేలా చేసింది. అయితే నయనతారను పెట్టుకుంటే తమిళ మార్కెట్ కూడా కలుస్తుంది కాబట్టి నాలుగు కోట్లుకు మరో నాలుగు కోట్లు యాడ్ అవుతుందే తప్ప నష్టం లేదని నిర్మాతలు భావిస్తున్నారు.  2021 మార్చి నుంచి షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక హిందీలో కథలో కీలకంగా ఉన్న టబు పాత్రను తెలుగులో నయనతార చేస్తుందని భావిస్తున్నారు.  మొదట ఆ పాత్రకు టబునే తీసుకుందామని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. కానీ చివరి నిముషంలో నయనతారను సీన్ లోకి తెచ్చారట. అందుకు చెబ్బబడుతున్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.  

ఈ సినిమాకోసం  టబుని సంప్రదిస్తే...తన రెమ్యునేషన్ గా కోటి రూపాయలు అడగటం షాక్ ఇచ్చిందిట. దానికి తోడు అలవైకుంఠపురములో ఆమె నటనటకు, గ్లామర్ కు రెస్పాన్స్ రాలేదు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకుని టబుని తెలుగులో తీసుకోవటం వల్ల పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదని, అందుకు ఆల్టర్నేటివ్ గా నయనతార కనిపించింది.  అయితే బాలీవుడ్ సినిమాకు టబు తెచ్చిన స్టార్ డమ్ ఏదైతే ఈ సినిమా కు  నయనతార తేగలుగుతుందా అనేది ఆలోచించాల్సిన విషయం.
 
 మూడు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’.  ఆయుష్మాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలని హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రైట్స్ తీసుకున్నారు.  ఈ చిత్రం హీరో చూడగలిగి కూడా గుడ్డివాడుగా నటించాలి!  ఆ పాత్రను నితిన్ వేయబోతున్నారు. రీసెంట్ గా భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఈ పాత్రను చేయటానికి ఉత్సాహం గా ఉన్నారు.  ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 

సాంకేతిక బృందం:
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంత్
సమర్పణ: బి. మధు (ఠాగూర్ మధు)
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్

Follow Us:
Download App:
  • android
  • ios