టైటిల్ వివాదం.. అరవింద్ ఏం డెసిషన్ తీసుకుంటారో!
‘భానుమతి రామకృష్ణ’ విషయంలో టైటిల్ వివాదం మొదలైంది. ‘అందాల రాక్షసి ఫేమ్’ నవీన్ చంద్ర హీరోగా నటించిన చిత్రమిది. త్వరలోనే ఓటీటీలో రాబోతోంది. చిత్రయూనిట్ ఓటీటీ విడుదలకు సన్నాహాలు చేస్తుంటే, ఇప్పుడు టైటిల్ సమస్య వచ్చి పడింది.
ఆ మధ్యకాలంలో ప్రతీ సినిమాకు ఏదో ఒక ఇష్యూ జరిగేది. టైటిల్ విషయంలోనే చాలా సమస్యలు మొదలైపోయేవి. మా కులాన్ని ఇబ్బంది పెడుతున్న టైటిల్, ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ రకరకాల వివాదాలు చుట్టుముట్టి విడుదలకు అడ్డుకట్ట వేసేవి. అయితే ఈ మధ్యకాలంలో అటువంటివి తగ్గిపోయాయి. కానీ చిత్రంగా ఇప్పుడు ‘భానుమతి రామకృష్ణ’ విషయంలో టైటిల్ వివాదం మొదలైంది. ‘అందాల రాక్షసి ఫేమ్’ నవీన్ చంద్ర హీరోగా నటించిన చిత్రమిది. త్వరలోనే ఓటీటీలో రాబోతోంది. చిత్రయూనిట్ ఓటీటీ విడుదలకు సన్నాహాలు చేస్తుంటే, ఇప్పుడు టైటిల్ సమస్య వచ్చి పడింది.
అలనాటి నటి భానుమతి రామకృష్ణ కుటుంబ సభ్యులు ఈ టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మా ఫర్మిషన్ లేనిదే టైటిల్ ఎలా వాడుకుంటారని వాళ్ల ప్రశ్న. ఆ టైటిల్ పెట్టి, భానుమతిని కించపరిచే దృశ్యాలతో సినిమా తీశారన్నది మరో వాదన. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆహా టీమ్ కానీ నిర్మాతలు కానీ ఈ టైటిల్ ని మార్చే ఉద్దేశ్యంలో లేరని తెలుస్తోంది. మరి లీగల్ గా ఏమన్నా కౌంటర్ ఇస్తారేమో చూడాలి. అల్లు అరవింద్ ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపుతారో ఇండస్ట్రీ చూస్తోంది.
ఇక భానుమతి పేరుతో ఓ బయోపిక్ నిర్మించాలని దానికి ‘భానుమతి రామకృష్ణ’ అనే టైటిల్ పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాతో ఆ టైటిల్ ఈ సినిమాకు వాడుకుంటే.. ఇబ్బందే కదా, అందుకే టైటిల్ విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు చెబుతున్నారంతే అంటున్నారు.
సలోనీ లుత్రా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించారు. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఆహా యాజమాన్యానికి చూపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాని ఆహా లో చూడబోతున్నాం అని అంటున్నారు. అమృతరామమ్ తర్వాత డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రం ఇదే కానుంది.