నాని, శర్వానంద్ తో సీతారామం డైరెక్టర్ భారీ మల్టీ స్టారర్...? అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ లో మరో భారీ మట్టీ స్టారర్ కు ప్లానింగ్ జరుగుతోంది. యంగ్స్ స్టార్స్ శర్వానంద్. నాని హీరోలుగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాను చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమాను ప్లాన్ చేసింది ఎవరు...?
టాలీవుడ్ లో మరో డిఫరెంట్ కాంబినేషన్ కు బీజం పడబోతోంది. మల్టీ స్టార్స్ ట్రెండింగ్ అవుతున్న ఈ టైమ్ లో మరో మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నారు. సీతారామం సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకులలో హను రాఘవపూడి. అందరు డైరెక్టర్ల కంటే కాస్త ప్రత్యేక శైలి కలిగిన ఈ దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్స్ అంతా పోటీపడుతున్న టైమ్ లో ఆయన మాత్రం నానీ, శర్వనంద్ తో సినిమాకు రెడీ అవుతున్నట్టు సమాచారం అందుతోంది.
ప్రేమకథలు... ఫీల్ గుడు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు డైరెక్టర్ హను. అందాల రాక్షసి దగ్గర నుంచి.. సీతారామం వరకూ అన్నీ ఫీల్ గుడ్ మూవీసే. ప్రేమ కథలను అందమైన సినిమాలుగా మలచడంలో హను రాఘవపూడికి మంచి నైపుణ్యం ఉంది. అంతే కాదు తనపై మణిరత్నం ప్రభావం ఎక్కువగా ఉందని గతంలోనే చెప్పారు హను రాఘవపూడి. ఇక గత కొన్ని సినిమాలు ఆయనకు నిరాశను మిగిల్చినా.. రీసెంట్ గాల సీతా రామం సినిమా కు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ కథను చాలా డిఫరెంట్ గా చూపించడంతో.. ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమాతో హను రాఘవపూడి కోసం స్టార్ హీరోలు సైతం కబురు పంపిస్తున్నట్టు తెలు్సతోంది. అయితే ఆయన మాత్రం తన తదుపరి సినిమాను మల్టీ స్టారర్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాత్రలకిగాను నానీ,శర్వానంద్ లను కూడా ఫిక్స్ చేసుకున్నాడ. ఈ సినిమాకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అసలు సీతారామం తరువాత నానీతో హను సినిమా చేయాల్సి ఉంది. ఇక దానిని మాల్టీ స్టారర్ కథతో చేయాలని నిర్ణించుకుని.. శర్వానంద్ ను కూడా కలిపేశారని సమాచారం.
ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. హిందూ ... ముస్లిమ్ యువకులుగా నానీ, శర్వాలను చూపించబోతుననారట. వాళ్ల మధ్య స్నేహాన్ని అద్భుతమైన సినిమాగా రూపొందించబోతున్నాడటు హను. ఇక నానీ .. శర్వానంద్ లతో హను రాఘవపూడికి మంచి సాన్నిహిత్యం ఉంది. నానితో ఆయన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఇక శర్వాతో పడి పడి లేచే మనసు చేశాడు. కాని శర్వానంత్ తో చేసిన సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తరువాత శర్వానంద్ మూడు నెలలు అసలు బయటకే రాలేదు. ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ చేయడానికి ఒక బడా నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం.