ఎన్టీఆర్ కి ప్రచారం కలిసిరాలేదు.. నేనే వద్దన్నా: బాలయ్య!
తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, మహాకూటమిలు జోరుగా ప్రచారం చేశాయి. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి నందమూరి సుహాసిని పోటీ చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణాలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ, మహాకూటమిలు జోరుగా ప్రచారం చేశాయి. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి నందమూరి సుహాసిని పోటీ చేసిన సంగతి తెలిసిందే.
ఆమె కోసం నందమూరి తారకరత్న, నందమూరి జానకిరామ్ భార్య, బాలకృష్ణ ఇలా ఆమె కుటుంబ సభ్యులు ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఇందులో భాగంగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ తనకు కూడా కొడుకే అంటూ చేసిన వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
సుహాసిని కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. దానికి కారణం నేనేనంటూ బాలయ్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ''సుహాసిని కోసం ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో ఎదుగుతూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో ప్రచారంలో పాల్గొంటే కొంతమంది నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్నికల ప్రచారం అంతగా కలిసిరాలేదు. ఆ భయంతోనే నేను తారక్ ని ప్రచారానికి రావొద్దని అన్నాను. తారక్ నా అన్న కొడుకు మాత్రమే కాదు.. నాకు కూడా కొడుకే. అందుకే ప్రచారానికి రానివ్వలేదు. నా కొడుకు మోక్షజ్ఞ ఎందుకు ప్రచారానికి రాలేదు.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.