Asianet News TeluguAsianet News Telugu

అర్జున్‌ రెడ్డి తరహా పాత్రలో కింగ్ నాగార్జున

ఈ సినిమాలో నాగార్జున  చీఫ్ సెక్యూరటి ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2021లో ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగ్ చేయబోయే పాత్ర ఇప్పటిదాగా ఆయన చేయనది.  ఏంగర్ మేనేజ్ మెంట్ ఇష్యూలతో బాధపడే సెక్యూరిటీ కమెండో గా తొలిసారి కనిపించి అలరించనున్నారు. ఇందుకోసం నాగార్జున గెటప్ దగ్గర నుంచి అన్ని మారపోనున్నాయి. బాడీ లాంగ్వేజ్ సైతం కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నాగార్జున సైతం తన బాడీని జిమ్ లలో కష్టపెడుతున్నారట.

Nagarjuna to transform as a security chief
Author
Hyderabad, First Published Aug 8, 2020, 4:09 PM IST

నాగార్జున కు తొలి నుంచి కొత్త తరహా పాత్రలు, క్యారక్టరైజేషన్స్ అంటే ఇష్టం. అందుకోసం ఆయన కొత్త డైరక్టర్స్ తోనూ, స్పార్క్ ఉన్న వాళ్లతోనూ పనిచేస్తూంటారు. అదే విధంగా ఆయన కొత్తగా ఓ పాత్ర చేయటానికి ఆయన కమిటయ్యారు.   ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి ఒకే చెప్పారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తగా నిర్మించనున్నాయి. ఏషియన్‌ గ్రూప్‌ చైర్మన్‌ నారాయణదాస్‌ నారంగ్‌ ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసారు.

ఈ సినిమాలో నాగార్జున  చీఫ్ సెక్యూరటి ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2021లో ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగ్ చేయబోయే పాత్ర ఇప్పటిదాకా ఆయన చేయనది.  ఏంగర్ మేనేజ్ మెంట్ ఇష్యూలతో బాధపడే సెక్యూరిటీ కమెండో గా తొలిసారి కనిపించి అలరించనున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ కూడా ఇలా యాంగర్ మేనేజ్‌మెంట్‌తో ఇబ్బంది పడే పాత్రలోనే కనిపించాడు. ఈ సినిమాలో క్యారెక్టర్‌ కోసం నాగార్జున గెటప్ దగ్గర నుంచి అన్ని మారపోనున్నాయి. బాడీ లాంగ్వేజ్ సైతం కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నాగార్జున సైతం తన బాడీని జిమ్ లలో కష్టపెడుతున్నారట.

కాగా, నాగార్జున ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రానికి ప్రవీణ్‌ పక్కా పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను రెడి చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక, నాగార్జున ప్రస్తుతం అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్‌ డాగ్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ వాయిదాపడింది.
 
ప్రవీణ్ సత్తారు తో చేయబోయే ఈ చిత్రానికి నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ అనంతరం.. ఒకటి రెండు సినిమాలు మినహా పెద్ద చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లు ఇంకా మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ ఎప్పుడూ మొదలవుతుందనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంసంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios