Asianet News TeluguAsianet News Telugu

మన్మథుడు 2: స్టోరీ లైన్.. ఫస్ట్ పార్ట్ తో సంబంధం?

అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి  సీక్వెల్ రెడీ అవుతోంది.    ‘మన్మథుడు 2’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏంటనేది ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. 
 

Nagarjuna 's Manmadhudu-2 movie story line
Author
Hyderabad, First Published Jun 18, 2019, 7:43 AM IST

 

అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో  2002లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి  సీక్వెల్ రెడీ అవుతోంది.    ‘మన్మథుడు 2’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏంటనేది ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. 

అందుతున్న సమాచారం ప్రకారం..నాగార్జున  45 ఏళ్లొచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోడు.. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లెప్పుడు అంటూ స‌తాయిస్తుంటారు..అలాంటి స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క ఓ అమ్మాయి(రకుల్ ప్రీతి సింగ్ )ని భార్య‌గా అద్దెకు తీసుకొస్తాడు.. కానీ కాలం గ‌డిచిన కొద్ది నిజంగానే వాళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు.  అయితే నాగార్జున ఇంతకు ముందు చేసిన గ్రీకు వీరుడు సినిమా కూడా దాదాపు ఇలాంటి కథే. 

అయితే అందులో ప్లే బోయ్ షేడ్స్ కనపడతాయి. అంతే కాకుండా ఈ సినిమా ఫ్రెంచ్ లో వచ్చిన ఐ డు సినిమాతో పోలికలు ఉండటంతో నిజంగా ఇదే కథ అయితే కాపీ రైట్స్ సమస్య వస్తాయంటున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా ఆల్రెడీ రైట్స్ తీసుకుని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  అలాగే  సీక్వెల్‌ కాబట్టి మొదటి పార్ట్‌ కథకు కంటిన్యూషన్ గా ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారని కేవలం టైటిల్ మాత్రమే తీసుకుంటారని తెలుస్తోంమది. 

ఇక టీజర్ లో నాగ్‌ ని చూసిన వారంతా నవ మన్మధుడు అంటున్నారు. అసలు ఆయన వయస్సు కనపడటం లేదని చెప్తున్నారు.  నాగ్, రకుల్‌ జంట చక్కగా కనిపించింది.   మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   రకుల్‌ప్రీత్‌ సింగ్, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్స్ . 

Follow Us:
Download App:
  • android
  • ios