నాగార్జున నెక్ట్స్ సినిమా ఫైనల్.. రిస్క్ చేస్తున్నాడు.. కానీ డిజప్పాయింట్ చేయడుగా?
నాగార్జున కొత్త సినిమా ఆల్మోస్ట్ ఖరారైంది. వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్న ఆయన ఈ సారి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నారట. ఈ సారి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట.
నాగార్జున ఇటీవల `ది ఘోస్ట్` చిత్రంతో వచ్చారు. ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నాగ్ సినిమాలు ఇటీవల వరుసగా నిరాశ పరుస్తున్నాయి. నేపథ్యంలో రూట్ మార్చారట నాగ్. మంచి ఎంటర్టైనింగ్ మూవీ చేయాలనుకుంటున్నారట. `బంగార్రాజు` తర్వాత కమర్షియల్ ఎలిమెంట్లు, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉండేలా చూసుకుంటున్నారట.
అందులో భాగంగా రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్తో ఓ సినిమా చేస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలకు రైటర్స్ గా పనిచేసిన ప్రసన్న కుమార్ నాగ్ మూవీతో దర్శకుడిగా మారబోతున్నారు. ప్రస్తుతం ప్రసన్న `ధమాకా` సినిమాకి రైటర్గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రసన్న కూడా ఇటీవల తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ సినిమా మలయాళంకి రీమేక్ అనే టాక్ వినిపించింది. `పొరింజు మరియం జోస్` సినిమాకి రీమేక్ అనే వార్తలు వినిపించిన నేపథ్యంలో అందులోనిజం లేదని తెలిపారు. తన సొంత కథతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత ఫైనల్ అయ్యారట. శ్రీనివాస చిట్టూరి తన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రసన్న `ధమాకా` బిజీలో ఉన్నారు. ఆ సినిమా రిలీజ్ అయి, ఆ హడావుడి పూర్తయ్యాక నాగ్ సినిమాపై ఫోకస్ పెడతారని, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆ సినిమాని స్టార్ట్ చేయనున్నారని టాక్.
నాగార్జునకి `సోగ్గాడే చిన్ని నాయన` తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు. దీంతో అభిమానులు నిరాశతో ఉన్నారు. ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయడంలో కింగ్ నువ్వే అంటూ కామెంట్లు పెట్టే స్థాయిలో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నాగ్కి ఇప్పుడు హిట్ అనివార్యమైంది. ఈ మరి ప్రసన్న సినిమాతోనైనా హిట్ అందుకుంటాడా? అనేది చూడాలి. అదే సమయంలో రైటర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రిస్క్ చేస్తున్నారు నాగ్. ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే నాగ్ ప్రస్తుతం `బిగ్ బాస్ తెలుగు 6`షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. రేపటి(ఆదివారం)తో ఈ షో పూర్తవుతుంది. ఇకపై ఆయన బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేయబోరని తెలుస్తుంది. ఆరో సీజన్ రేటింగ్ దారుణంగా పడిపోవడం, కంటెస్టెంట్ల ఎలిమినేషన్ అన్ పెయిర్గా ఉండటం, ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ షోకి గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.