Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్య, సమంత విడిపోవటం ముందే నాగ్ ఊహించి అలా చేసారా?

ఏడేళ్ల ప్రేమ బంధం నాలుగేళ్ల వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు చైతన్య- సమంత.  చై సామ్ విడిపోతున్నట్టు ప్రకటించారు.. నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను తెలిపింది. దాంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇలాంటి న్యూస్ వస్తుందంటే ఇండస్ట్రీ జనాలు కూడా నమ్మలేదు

Nagarjuna Expected Chaitanya, Samantha Divorce Even Before Marriage?
Author
Hyderabad, First Published Oct 5, 2021, 12:53 PM IST


గత కొన్ని రోజులుగా మీడియాలో, అక్కినేని అభిమానుల్లో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం నిజమయింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో సమంత, చైతన్య ఈ రోజు అధికారిక ప్రకటన విడుదల చేసి కన్ఫర్మ్ చేసారు. చాలా కాలం నుంచి ఈ విషయం గురించి ఆలోచించి నాగ చైతన్య, నేను ఓ నిర్ణయానికి వచ్చాము. ఇక నుంచి మీము ఇద్దరం భార్య భర్తలుగా విడిపోతున్నాము. ఈ పది సంవత్సరాల కాలంలో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అది అలానే కొనసాగుతుందని అనుకుంటున్నాము. ఈ క్లిష్ట సమయంలో మా భావాలను అభిమానలు అర్ధం చేసుకుంటారని, మా ప్రైవసీని గౌరవిస్తారని కోరుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు మాకు ఉండాలి అంటూ ఓ పోస్ట్ చేశారు సమంత.  

ఈ సందర్బంగా సమంతకు ఎంత భరణం ఇస్తారనే టాపిక్ అంతటా మొదలైంది. అలాగే రెండు వందల కోట్లు ఆమెకు నాగచైతన్య ఆఫర్ చేసారని, ఆమె వద్దు అందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపద్యంలో అసలు భరణం ఇచ్చే అవకాసం లేదని, అందుకు  పెళ్లికు ముందు జరిగిన ఎగ్రిమెంటే కారణం అని చెప్తున్నారు. వివాహం నిశ్చయమైన తర్వాత సురేష్ బాబు, నాగార్జున కలిసి ఆలోచించి ఓ ఎగ్రిమెంట్ చేయించారని, అందులో భరణం వద్దు అనే క్లాజ్ ఉందని అంటున్నారు. సమంత ఓకే అని సైన్ చేసిందని చెప్తున్నారు.అలా తెలివిగా ముందే ఆలోచించారని,ఇవన్నీ సంపర్న కుటుంబాల్లో కామన్ థింగ్ అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఎగ్రిమెంట్ విషయమై ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

 

Related తీవ్ర ఆవేదనలో సమంత తండ్రి జోసెఫ్... సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్

నాగ చైతన్య, సమంత విడాకులపై నాగార్జున స్పందించారు. నాగ చైతన్య, సమంత మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారిద్దరు విడిపోయారు. ఈ విషయం ఒక రకంగా నాకు ఎంతో బాధ కలిగించింది. ఒక భార్య భర్తలుగా వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో వారి వ్యక్తిగత విషయం. వాళ్లిద్దరు నాకు కావాల్సిన వారు. వారితో నేను గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. సమంత, నాగ చైతన్యకు ఆ దేవుడు గుండె ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.

ఇక నాగార్జున ట్విట్టర్ లో వీళ్లు విడిపోయారనే ప్రకటన వచ్చాక ...‘‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్‌, చైలు విడిపోవటం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’ అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios