నాగార్జున పట్టించుకోవడం మానేశాడా..?
సీనియర్ హీరో నాగార్జున ఒకప్పుడు తన మేనల్లుడు సుమంత్ సినిమాలకు ఎంతగానో సహాయం చేసేవాడు. సినిమాను మొదలుపెట్టిన తరువాత చాలా పనులు దగ్గరుండి చూసుకునేవాడు.
సీనియర్ హీరో నాగార్జున ఒకప్పుడు తన మేనల్లుడు సుమంత్ సినిమాలకు ఎంతగానో సహాయం చేసేవాడు. సినిమాను మొదలుపెట్టిన తరువాత చాలా పనులు దగ్గరుండి చూసుకునేవాడు. తనవంతు ప్రమోషన్స్ లో కూడా హెల్ప్ చేసేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
నాగ్.. సుమంత్ సినిమాల గురించి కనీసం పట్టించుకోవడం లేదు. దానికి కూడా కారణం ఉందనే చెప్పాలి. నాగార్జున ఇద్దరు కొడుకుల భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నారు. మొన్నటివరకు చైతు సినిమాలు బాగానే ఆడుతున్నాయని ఊపిరి పీల్చుకోగానే అతడికి వరుసగా ఫ్లాప్ సినిమాలు పడుతున్నాయి. మరోపక్క రెండో కొడుకు అఖిల్ ఇప్పటివరకు రెండు సినిమాలలో నటించినా సరైన హిట్ అందుకోలేకపోయాడు.
దీంతో తన కొడుకుల భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నాగార్జున మేనల్లుడు సుమంత్ ని లైట్ తీసుకుంటున్నాడు. అసలు సుమంత్ ఏం చేస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదట. సుమంత్ రొటీన్ సినిమాలకు గుడ్ బై చెప్పి కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ హిట్టు కూడా అందుకున్నాడు.
ప్రస్తుతం అతడు ఇదం జగత్, సుబ్రమణ్యపురం వంటి సినిమాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నా ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వడం లేదు. నాగార్జున రంగంలోకి దిగితే ఈ సినిమాలు ప్రేక్షకుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కానీ నాగ్ మాత్రం పట్టించుకునే స్థితిలో లేడు!