నాగచైతన్య(Naga Chaitanya )-సమంత(Samantha) డివోర్స్ ప్రకటించి రెండు నెలలు పైనే అవుతోంది. అయినా సరే ఈ ఇష్యూపై రకరకాల రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే వీటిపై తాజాగా స్పందించారు కింగ్ నాగార్జున(Nagarjuna).

నాగచైతన్య(Naga Chaitanya )-సమంత(Samantha) డివోర్స్ ప్రకటించి రెండు నెలలు పైనే అవుతోంది. అయినా సరే ఈ ఇష్యూపై రకరకాల రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే వీటిపై తాజాగా స్పందించారు కింగ్ నాగార్జున(Nagarjuna).

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నాగచైతన్య(Naga Chaitanya )-సమంత(Samantha) విడాకులు ప్రకటన చేసి అందరిని ఆశ్చర్య పరిచారు. ఈ ప్రకటన చేసి రెండు నెలలు పైనే అవుతున్నా.. ఇంకా ఈ విషయాన్ని సోషల్ మీడియా వదలడం లేదు. ఈ ఇష్యూపై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఇక దీని గురించి రీసెంట్ గా ఓ జాతీయ మీడియాతో ఇంటర్వ్యూ అప్పుడు మాట్లాడారు నాగార్జున.

నాగచైతన్య(Naga Chaitanya )-సమంత(Samantha) విడాకులు తీసుకోవడం బాధాకరం. కాని ఈ విషయం గురించి రకరకాల వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో ఎన్నో రాశారు. కాని వాటిని నేను కాని చైతూ కాని పట్టించుకోలేదు అన్నారు నాగ్. అంతే కాదు వాళ్లు విడిపోవడం అనేది వాళ్ళిద్దరి పర్సనల్ విషయంలో.. అందులో సంబంధం లేని వాళ్లను లాగి.. వారినిబ్లేమ్ చేయడం మంచిది కాదు అన్నారు.

ముఖ్యంగా వీరి విడాకుల విషయంలో నాగార్జున(Nagarjuna) తన ఫ్యామిలీని లాగడం పట్ల అసంతృప్తి వ్యాక్తం చేశారు. పెళ్ళి తరువాత కూడా సమంత Samantha) బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుండటంతో నాగచైతన్య(Naga Chaitanya ), నాగార్జున(Nagarjuna) వద్దని చెప్పారని... దాని వల్ల కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయ్యాయంటూ.. ఇంకా చాలా వార్తలు వినిపించాయి. కాని ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు.. ఇవన్నీ తనతో పాటు నాగచైతన్య కూడా లైట్ తీసుకున్నట్టు చెప్పారు నాగార్జున. కాని ఈ ఇష్యూలో తన ఫ్యామిలీదే తప్పంటూ బ్లేమ్ చేయడం తనను బాగా బాధించిందన్నారు.

విడాకులు తరువాత సమంత Samantha) ఏ పోస్ట్ పెట్టినా.. అది వైరల్ అయ్యింది. అందులోను కొన్ని పోస్ట్ లలో చైతూది తప్పు అన్నట్టు అర్ధం తీసుకుంటూ వచ్చారు సోషల్ మీడియా జనాలు. దాంతో అక్కినేని ప్యామిలీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వాటి గురించి ఇప్పటి వరూ ఎవరూ మాట్లాడలేదు. కాని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం కోన్ని విషయాలు తనను బాధించాయి అన్నారు నాగ్(Nagarjuna).