రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’. దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకోగా..  తాజాగా మరో సాలిడ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. 

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మూడేండ్ల కిందనే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేళలకు ఈ చిత్రాన్ని ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. 1990లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం చుట్టూ కథాంశం తిరగనున్నది. నీది నాది ఒకే కథ' చిత్రంతో తన సత్తా చూపించిన వేణు ఊడుగుల విరాటపర్వం కథని చాలా బలంగా రాశారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల రెండు సాంగ్స్ కూడా రిలీజ్ అయి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. కాగా తాజాగా మరో సాలిడ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నగాదారిలో’అనే టైటిల్ తో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట వినసొంపుగా ఉంది. కాగా, నరేంద్ రెడ్డి, సనాపాటి భరద్వాజ్ పాత్రుడు కలిసి అద్భుతమైన లిరిక్స్ అందించగా, సింగర్ వరం చక్కగా పాడు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి క్యాచీ ట్యూన్ అందించారు. ప్రస్తతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 

అన్ని అడ్డంకులను, సమస్యలను అధిగమించి ఎట్టకేళలకు ‘విరాట పర్వం’ సినిమాను జూలై 17న రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Scroll to load tweet…