తండేల్ గ్రాండ్ లాంచ్... స్పెషల్ అట్రాక్షన్ గా వెంకీ మామ, మన్మథుడు నాగ్!
నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం తండేల్. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్ర లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
అక్కినేని హీరో నాగ చైతన్య దూత సిరీస్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న దూత విపరీతమైన ఆదరణ దక్కించుకుంటుంది. సక్సెస్ కిక్ లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దర్శకుడు చందూ మొండేటితో ఇప్పటికే నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. తండేల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తండేల్ అనగా పడవ నడిపేవాడని అర్థం అట.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. తండేల్ పూజ కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లో లాంచ్ చేశారు. తండేల్ లాంచింగ్ ఈవెంట్ కి నాగార్జున, వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు వేడుకలో పాల్గొన్నారు.
మొన్న చరణ్ నిన్న ఎన్టీఆర్ నేడు మహేష్!
తండేల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి పల్లవి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె చుడిదార్ లో చాలా సింపుల్ గా హాజరైంది. నాగ చైతన్య, సాయి పల్లవిలపై నాగార్జున క్లాప్ కొట్టారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఎమోషనల్ లవ్ డ్రామాగా తండేల్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. తండేల్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.